SSMB29 : పొలిటికల్ లీడర్స్‌తో రాజమౌళి భేటీ.. SSMB29 మూవీ గురించి చర్చ..

రీసెంట్ గా రాజమౌళి కొందరు పొలిటికల్ లీడర్స్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక ఉన్న కారణం..

SSMB29 : పొలిటికల్ లీడర్స్‌తో రాజమౌళి భేటీ.. SSMB29 మూవీ గురించి చర్చ..

Rajamouli met Political leaders and discuss about Mahesh Babu SSMB29

SSMB29 : రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే SSMB29 కోసం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంతోమంది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది..? ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది..? ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? అసలు టైటిల్ ఏంటి..? ఇలా ఎన్నో ప్రశ్నలు గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఈ ప్రశ్నలు గురించి రాజమౌళి మాట్లాడారు.

రీసెంట్ గా రాజమౌళి కొందరు పొలిటికల్ లీడర్స్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక ఉన్న కారణం ఏంటి అనేది తెలియదుగాని. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాజమౌళి, పొలిటికల్ లీడర్స్ తో SSMB29 గురించి మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ప్రశ్నించగా, జక్కన్న బదులిస్తూ.. త్వరలోనే మొదలవుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

Also read : Ram Charan : హాలీవుడ్‌లో రామ్‌చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. చరణ్ లాంటి నటుడు కావాలంటూ ప్రకటన..

ఇక ఈ మూవీకి టైటిల్ ఏం పెట్టారు అని ప్రశ్నించగా, రాజమౌళి బదులిస్తూ.. ఇంకా పెట్టలేదు అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది మేలో స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ లాంచ్ ఈవెంట్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరల్డ్ టాప్ డైరెక్టర్ ‘జేమ్స్ కామెరాన్’ ఈ మూవీ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా రాబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. కాగా ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కబోతుందని రాజమౌళి ఇప్పటికే తెలియజేసారు. కె ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక హీరోయిన్ గా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.