Thatikonda Rajaiah: వరంగల్ జిల్లా బీఆర్ఎస్లో కీలక పరిణామం
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై కేసీఆర్కు రాజయ్య వివరాలు తెలిపారు.
వరంగల్ జిల్లా బీఆర్ఎస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ లో చేరడానికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజయ్య సమావేశమయ్యారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై కేసీఆర్కు రాజయ్య వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్య బీఆర్ఎస్లో చేరేందుకు కేసీఆర్ పచ్చజెండా ఊపారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజయ్యను కేసీఆర్ నియమించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీకి రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి కేసీఆర్ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే, లోక్సభ ఎన్నికల్లో పోటీకి కడియం శ్రీహరి కూతురు కావ్యకు టికెట్ దక్కింది. దీంతో రాజయ్య బీఆర్ఎస్ ను వీడారు. కడియం శ్రీహరి, ఆయన కూతురు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ లో చేరుతున్నారు.
Also Read: మరి కేసీఆర్ కట్టిన సచివాలయంలో రేవంత్ రెడ్డి ఎలా కూర్చుంటున్నారు?: బాల్క సుమన్