తక్కువ పరుగులకే విరాట్ కోహ్లీ అవుట్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19ఓవర్లల్లో కేవలం 199 పరుగులకు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటర్లలో పంత్ (42) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.
![తక్కువ పరుగులకే విరాట్ కోహ్లీ అవుట్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్ తక్కువ పరుగులకే విరాట్ కోహ్లీ అవుట్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్](https://10tv.in/wp-content/uploads/2024/06/Virat-Kohli-1.jpg)
Virat Kohli
India vs Pakistan : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం (జూన్ 9) పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత్ బౌలర్లు పాక్ బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేశారు. దీంతో భారత జట్టు నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దాయాది పాకిస్థాన్ జట్టు పోరాడి ఓడింది.
Also Read : IND VS PAK : టీ20 ప్రపంచకప్.. ఉత్కంఠ పోరులో పాక్పై 6 పరుగుల తేడాతో భారత్ విజయం
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19ఓవర్లల్లో కేవలం 119 పరుగులకు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటర్లలో పంత్ (42) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ (13), విరాట్ కోహ్లీ (4) స్వల్ప పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. మ్యాచ్ రెండో ఓవర్ ను పాక్ బౌలర్ నసీమ్ షా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లలో ఓ బాల్ ను ఆఫ్ స్టంప్ నుండి వైడ్ గా వేశాడు. దానిని కోహ్లీ ఆడే ప్రయత్నం చేయగా నేరుగా ఉస్మాన్ ఖాన్ చేతుల్లోకి వెళ్లింది. విరాట్ పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో స్టేడియంలో మ్యాచ్ ను వీక్షిస్తున్న అతని సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిరాశను వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Anushka Sharma upset after Virat Kohli early dismissal. #INDvsPAK pic.twitter.com/QgKJP50KkI
— Mufa Kohli (@MufaKohli) June 9, 2024