Kaalam Raasina Kathalu : ‘కాలం రాసిన కథలు’ ట్రైలర్ చూశారా? ఆకాష్ జగన్నాధ్ చేతుల మీదుగా రిలీజ్..

కాలం రాసిన కథలు ట్రైలర్ ని పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ జగన్నాధ్ లాంచ్ చేసారు.

Kaalam Raasina Kathalu : ‘కాలం రాసిన కథలు’ ట్రైలర్ చూశారా? ఆకాష్ జగన్నాధ్ చేతుల మీదుగా రిలీజ్..

Kaalam Raasina Kathalu Trailer Launch By Akash Jagannadh

Kaalam Raasina Kathalu : అందరూ కొత్తవాళ్లతో MNV సాగర్ స్వీయ దర్శకత్వంతో పాటు తనే నిర్మించిన సినిమా ‘కాలం రాసిన కథలు’. ట్రైలర్ చూస్తుంటే నాలుగు ప్రేమ కథలు, ఆ ప్రేమకు డబ్బు సమస్య, ఇంట్లో ఒప్పుకోకపోవడం లాంటి సమస్యల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సమస్యలతో పాటు రొమాంటిక్ సీన్స్ కూడా సినిమాలో బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.

Also Read : Pawan kalyan : అడ‌విలో స్మ‌గ్లింగ్‌ చేసేవారిని హీరోలుగా చూపిస్తున్నారు.. సినిమాల‌పై ప‌వ‌న్ వ్యాఖ్య‌లు..

కాలం రాసిన కథలు ట్రైలర్ ని పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ జగన్నాధ్ లాంచ్ చేసారు. ట్రైలర్ లాంచ్ అనంతరం ఆకాష్ జగన్నాధ్ మాట్లాడుతూ.. కొత్త నటీనటులు అయినా బాగా నటించారు. ట్రైలర్లో నాలుగు కథలలో లవ్ కంటెంట్, డైలాగ్స్ ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. డైరెక్టర్ గా సాగర్ ఈ సినిమాని బాగా తెరకెక్కించాడని అర్ధమవుతుంది. ఈ సినిమా యూత్ ని ఆకర్షిస్తుంది. కాలం రాసిన కథలు ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కాబోతుంది. అందరికి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు. మీరు కూడా కాలం రాసిన కథలు ట్రైలర్ చూసేయండి..

దర్శకనిర్మాత MNV సాగర్.. నా గురువుగా భావించే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి తనయుడు ఆకాష్ జగన్నాథ్ మా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం నాకు సంతోషంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో ఉన్న యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈ కాలం రాసిన కథలు తెరకెక్కుతుంది. 60 ఏళ్ళ తర్వాత పునర్జన్మతో వచ్చిన బంధాలు, నమ్మకానికి మోసానికి మధ్య బలౌవుతున్న మనసు, నలిగిపోయిన మనిషి జీవితాల్లో 30 ఏళ్ళ క్రితం పరువు హత్యల మధ్య ఈ కథ సాగుతుంది. మచిలీపట్నం, పెడన, ఆ చుట్టు పక్కల షూటింగ్ చేసాము. చాలా మంది కొత్తవాళ్లు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కానుంది అని తెలిపారు.

Kaalam Raasina Kathalu Trailer Launch By Akash Jagannadh