వెయింటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు షాక్ ఇచ్చిన డీజీపీ… వారికి కీలక ఆదేశాలు జారీ

మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఇద్దరు డీజీ స్థాయి అధికారులు, ముగ్గురు ఐజీలు, డీఐజీలు పలువురు ఎస్పీలు ఉన్నారు.

వెయింటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు షాక్ ఇచ్చిన డీజీపీ… వారికి కీలక ఆదేశాలు జారీ

AP DGP Memo (Photo Credit : Google)

AP DGP Memo : వెయింటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు బిగ్ షాక్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని సీనియర్ ఐపీఎస్ లకు ఆయన మెమో జారీ చేశారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీజీపీ ఆఫీస్ లోనే ఉండాలని ఆ ఐపీఎస్ లను ఆదేశించారు డీజీపీ. వెయిటింగ్ హాల్ లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్ లకు డీజీపీ ఆదేశాలిచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఇద్దరు డీజీ స్థాయి అధికారులు, ముగ్గురు ఐజీలు, డీఐజీలు పలువురు ఎస్పీలు ఉన్నారు.

వెయింటింగ్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ లు..
డీజీపీ స్థాయి అధికారులు- పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్
అదనపు డీజీ-సంజయ్
ఐజీలు కాంతి రాణా, కొల్లి రఘురామిరెడ్డి
డీఐజీలు అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని

వెయిటింగ్ లో ఉన్న ఎస్పీ స్థాయి ఐపీఎస్ లు..
రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణ కాంత్ పటేల్, అన్బురాజన్…