Akepati Amarnath Reddy : అన్నమయ్య మార్గంలో తిరుమలకు చేరుకున్న కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాదయాత్ర

చాలా కష్టతరమైన నడకదారి అయినప్పటికీ వేలాదిగా భక్తులు నడిచి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. అన్నమయ్య మార్గంలో పాదయాత్ర చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమన్నారు.

Akepati Amarnath Reddy : అన్నమయ్య మార్గంలో తిరుమలకు చేరుకున్న కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాదయాత్ర

Akepati

Akepati Amarnath Reddy padayatra : కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాదయాత్ర అన్నమయ్య మార్గంలో తిరుమలకు చేరుకుంది. పాదయాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అన్నమయ్య మార్గంలో పాదయాత్ర ద్వారా భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. అన్నమాచార్యులవారు వెంకటేశ్వర స్వామిపై 32 వేల కీర్తనలు రచించారు. అన్నమయ్య నడిచిన మార్గాన్ని అభివృద్ధి చేయాలని ఎప్పటి నుండో కోరుతున్నామని ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. ఇప్పటికీ 19 సార్లు అన్నమయ్య మార్గంలో కాలినడకన తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా తనతో కలిసి ఇప్పటికి ఏడుసార్లు అన్నమయ్య మార్గంలో పాదయాత్రలో పాల్గొన్నారని పేర్కొన్నారు. చాలా కష్టతరమైన నడకదారి అయినప్పటికీ వేలాది మంది భక్తులు నడిచి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. అన్నమయ్య మార్గంలో పాదయాత్ర చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అని అన్నారు. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సంకల్పించారు..ఆయన మరణంతో ప్రతిపాదన మరుగున పడిందని చెప్పారు.

Aishwarya Rai : పనామా పేపర్స్ కేసు.. ఈడీ ముందు హాజరైన బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్​

మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని కోరినట్లు గుర్తుచేశారు. టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి కూడా వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. టీటీడీ పాలక మండలి తమ విన్నపాన్ని మన్నించి అన్నమయ్య మార్గం అభివృద్ధికి ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది నుండి కొత్త నడకదారిలో నడుస్తామని తమకు నమ్మకం ఉందని ఆకేపాటి అమర్ నాథరెడ్డి అన్నారు.

అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య మార్గంలో నడిచి తిరుమలకు రావడం చాలా సంతృప్తినిచ్చిందన్నారు. ఆకేపాటి అమర్నాత్ రెడ్డితో కలిసి వేలాదిగా పేద భక్తులు అన్నమయ్య మార్గంలో తిరుమలకు రావడం జరుగుతోందని తెలిపారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు టీటీడీ పాలక మండలి అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

CM Kejriwal : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..ఉచిత రేషన్ పథకం 6 నెలలపాటు పొడిగింపు

అన్నమయ్య మార్గంలో కొండచరియలు కనిపించకపోవడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేసి పవిత్రమైన పాటలతో మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అన్నమయ్య మార్గంలో వేలాది మంది భక్తులు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలినడకన తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు.