Pm Modi: ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలోని ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. కెమికల్ ఫ్యాక్టరీలో పలువురు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం అని పేర్కొన్

Pm Modi: ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

Eluru Chemical Factory Incident Prime Minister Modi's Response

Pm Modi : కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలోని ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు కార్మికులు మృతి చెందగా, మరో 13 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. కెమికల్ ఫ్యాక్టరీలో పలువురు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సానుభూతి ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Also read :  Eluru district : ఏలూరు జిల్లాలో విషాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు మృతి

ఈ ప్రమాద ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 25లక్షల పరిహారంను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ. 5లక్షలు, గాయపడిన వారికి రూ. 2లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని సీఎం జగన్ ఆదేశించారు. మృతుల్లో నలుగురు బీహార్ వాసులు, ఇద్దరు స్థానికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. క్షతగాత్రుల్లో ఏడుగు స్థానికులు, ఐదుగురు బీహార్ వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఏలూరు జిల్లాలోని అక్కిరెడ్డిగూడెం పరిధిలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు కార్మికులు మృతి చెందగా, మరో 13 మంది కార్మికులకు గాయాలయ్యాయి. జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డి గూడెం వద్ద పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో యూనిట్ 4లో బుధవారం (ఏప్రిల్ 13,2022) రాత్రి రియాక్టర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 50 మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా రియాక్టర్ పేలి మంటలు చెలరేగడంతో ఐదుగురు కార్మికులు మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు. మరో కార్మికుడు తీవ్రగాయాలతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు వదిలాడు.

Also read : Eluru district: అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్ర్భాంతి.. మృతుల కుటుంబాలకు రూ. 25లక్షలు పరిహారం..

ఈ ప్రమాదంలో 13 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిపమాదం ఘటనలో రెండు ఫోర్లు పూర్తిగా కాలిపోయాయి. మృతుల్లో నలుగురు బీహార్ కు చెందినవారిగా గుర్తించారు.