AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ప్రధాన చర్చ ఆ అంశాలపైనే..

సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ లో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరగనుంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత...

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ప్రధాన చర్చ ఆ అంశాలపైనే..

Ap Cm Jagan

AP Cabinet Meeting: సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ లో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరగనుంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా కేబినెట్ భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తొలుత శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. కానీ పలు కారణాల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఏర్పాటు చేశారు. నూతన మంత్రి వర్గం తొలి సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని చర్చ జరుగుతుంది.

Ap cm jagan: నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే టెన్త్ పేపర్ లీక్.. జగన్‌కు మంచిపేరు రాకూడదనే..

దేవాదాయ శాఖలో రెండు లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే ఇందులో దాదాపు లక్ష ఎకరాలు అర్చకుల ఆక్రమణలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దిశ చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ లో మరోమారు నిర్ణయం తీసుకొని కేంద్రానికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మ ఒడి పథకం అమలుకు సంబంధించిన మొత్తాన్ని కేబినెట్ ఆమోదించే అవకాశముంది. గడప గడపకూ ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన అంశంపైనా కేబినెట్ లో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అందకుండా అర్హులు ఎవరైనా ఉంటే వారికి సంక్షేమ పథకాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.

AP CM Jagan : విజయవాడలో అత్యాచారం ఘటన.. బాధితురాలికి ప్రభుత్వం పరిహారం

ఈ క్రమంలో ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ విషయంపై మరోసారి సీఎం జగన్ మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు తుపాన్ పరిస్థితులు, జరిగిన నష్టం, బాధితుల నష్టపరిహారం పై కేబినెట్ లో చర్చ జరగనుంది. అలాగే మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గానికి సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఇక మూడు రాజధానుల బిల్లు అంశంపైనా కేబినెట్ లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.