AP CM Jagan: బుధవారం ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ

మంగళవారం సాయంత్రం జగన్ ఢిల్లీ వెళ్తారు. ఆ రోజు అక్కడే బస చేస్తారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రధానితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గతంలో కూడా అనేకసార్లు జగన్ ప్రధానిని కలిసి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు.

AP CM Jagan: బుధవారం ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో పర్యటిస్తారు. అక్కడ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం జగన్ ఢిల్లీ వెళ్తారు. ఆ రోజు అక్కడే బస చేస్తారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రధానితో భేటీ అవుతారు.

Paragliding: ప్రాణాలు తీసిన పారాగ్లైడింగ్.. గుజరాత్‌లో దక్షిణ కొరియా వాసి మృతి, హిమాచల్ ప్రదేశ్‌లో మరొకరు

ఈ భేటీ సందర్భంగా విభజన హామీలు, ఏపీకి రావాల్సిన నిధుల గురించి మోదీని అడిగే అవకాశం ఉంది. కాగా, బుధవారం ఏపీలో జరిగే ఒక అధికారిక కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే, ప్రధాని కార్యాలయం జగన్‌కు అదే రోజు అపాయింట్‌మెంట్ ఖరారు చేయడంతో సీఎం తన కార్యక్రమం వాయిదా వేసుకున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. నర్సీపట్నంలో జరిగే కార్యక్రమాన్ని ఈ నెల 30న నిర్వహిస్తారు. ప్రస్తుతం ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ సమయంలో రాష్ట్రానికి నిధుల లభ్యత చాలా అవసరం. అందుకే ప్రధానిని కలిసి రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని కోరే అవకాశం ఉంది. గతంలో కూడా అనేకసార్లు జగన్ ప్రధానిని కలిసి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు.