AP Covid-19 Live Updates : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

  • Published By: sreehari ,Published On : October 14, 2020 / 07:22 PM IST
AP Covid-19 Live Updates : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

AP Covid-19 Live Updates: కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 69,463 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 3,892 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.



రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 7,67,465లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి.

కరోనా బారినపడి 28 మంది మరణించారు. 5,050 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 7,19,477 మంది డిశ్చార్జి అయ్యారు.



రాష్ట్రంలో ఇప్పటివరకూ 67,72,273 మందికి శాంపిల్స్ పరీక్షించగా..41,669 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,319కు చేరుకుంది.



ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, కర్నూల్ లో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.