AP Governor Biswabhusan : కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్‌కు మళ్లీ అస్వస్థత

ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ను హైదరాబాద్ తరలించారు..

AP Governor Biswabhusan : కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్‌కు మళ్లీ అస్వస్థత

Ap Governor Biswabhusan Harichandan

AP Governor Biswabhusan : ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ ఏఐజీకి తరలించారు అధికారులు. కరోనా బారిన పడ్డ గవర్నర్ దంపతులు ఇటీవలే కోలుకున్నారు. కొవిడ్ నుంచి కోలుకుని ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి రాజ్ భవన్ కు వచ్చిన నాటి నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారు. పోస్ట్ కొవిడ్ సమస్యతో గవర్నర్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi : శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. సినీ పరిశ్రమకు తీరని లోటు

ఈ నెల 15న గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన 17న హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడి చికిత్స పొందారు. ఈ నెల 20, 22 తేదీల్లో ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో 23న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు డాక్టర్లు. కాగా, ఆదివారం(నవంబర్ 28,2021) సాయంత్రం మరోసారి అస్వస్థతకు గురి కావడంతో గవర్నర్ ను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.