AP Corona : ఏపీలో కొత్తగా 259 కరోనా కేసులు

ఏపీలో గత 24 గంటల్లో 33వేల 437 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 259 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

AP Corona : ఏపీలో కొత్తగా 259 కరోనా కేసులు

Ap Corona Cases

AP Corona : ఏపీలో గత 24 గంటల్లో 33వేల 437 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 259 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 48 కేసులు నమోదు కాగా… కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. గుంటూరులో ఇద్దరు.. కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

354 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు 20,66,929 కేసులు నమోదు కాగా… 20,48,505 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 14వేల 382 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4వేల 042 యాక్టివ్ కేసులు ఉన్నాయి.