Chandrababu : చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్… సీఎస్కు చంద్రబాబు లేఖ
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ కు లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. గ్రానైట్ అక్రమ తవ్వకం, రవాణాపై చర్యలు తీసుకోవాలని..
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ కు లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. గ్రానైట్ అక్రమ తవ్వకం, రవాణాపై చర్యలు తీసుకోవాలని సీఎస్ సమీర్ శర్మకు రాసిన లేఖలో కోరారు. శాంతిపురం మండలం ముద్దనపల్లెలో గ్రానైట్ అక్రమ మైనింగ్ జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు.
Chandrababu : వైసీపీ అధికారంలోకి వస్తే చీకటి రాజ్యం వస్తుందని ఆనాడే చెప్పా-చంద్రబాబు
అక్రమ మైనింగ్ పై గత నెలలో కుప్పంలో పర్యటించిన సందర్భంగా స్వయంగా పరిశీలించినట్టు చంద్రబాబు తెలిపారు. మైనింగ్ అక్రమాలు నిజమేనని అధికారులు కూడా నిర్ధారించారని అన్నారు. అయితే, తనిఖీల తర్వాత కూడా 104, 213 సర్వే నెంబర్లలో అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉందని వివరించారు. ఇందులో అధికార పార్టీ నేతలు భాగస్వాములైనందు వల్లే చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు చంద్రబాబు. వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న చంద్రబాబు.. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎస్ ను డిమాండ్ చేశారు.
Pawan Kalyan : గౌతమ్ సవాంగ్ని ఎందుకు తప్పించారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్