Andhra Pradesh: ఆ హామీ ఇంకెప్పుడు అమలవుతుందని మూడేళ్లుగా యువత ఎదురుచూస్తున్నారు: చంద్ర‌బాబు

 ఉద్యోగాల భ‌ర్తీపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్ల జారీలో జాప్యం, గ్రూప్‌-1 ఉద్యోగాల అభ్యర్థుల విష‌యంలో అవకతవకలు జరిగాయని ఆయ‌న అన్నారు.

Andhra Pradesh: ఆ హామీ ఇంకెప్పుడు అమలవుతుందని మూడేళ్లుగా యువత ఎదురుచూస్తున్నారు: చంద్ర‌బాబు

Chandrababu naidu

Andhra Pradesh: ఉద్యోగాల భ‌ర్తీపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్ల జారీలో జాప్యం, గ్రూప్‌-1 ఉద్యోగాల అభ్యర్థుల విష‌యంలో అవకతవకలు జరిగాయని ఆయ‌న అన్నారు. నిరుద్యోగ యువత కలలు, లక్ష్యాలను సాకారం చేయాల్సిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వీర్యమైనట్లు క‌న‌ప‌డుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రతి ఏడాది జనవరిలో క్రమం తప్పకుండా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న ప్రభుత్వం హామీ ఇచ్చింద‌ని, ఆ హామీ ఇంకెప్ప‌టి నుంచి అమలవుతుందని మూడేళ్లుగా యువత ఎదురు చూస్తున్నారని చంద్ర‌బాబు అన్నారు.

prophet row: విచార‌ణ‌కు రావ‌డానికి స‌మ‌యం ఇవ్వండి: నుపుర్ శ‌ర్మ‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్థుల‌ను ఎంపిక చేయడంలో గత మూడేళ్లుగా వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగార్థుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదనను కలుగజేస్తున్నాయ‌ని చెప్పారు. 2018లో ప్రకటించిన 165 గ్రూప్‌-1 ఉద్యోగాలకు 2019 డిసెంబ‌రులో రాత‌ పరీక్షలు నిర్వ‌హించి, 2021 మేలో ఫలితాలు ప్రకటించారని ఆయ‌న అన్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీల ప్రకటన నుంచి ఫలితాల విడుదల వరకు అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని ఆయ‌న గుర్తు చేశారు.

New Labour laws: జూలై 1 నుంచే దేశంలో కొత్త కార్మిక చ‌ట్టాలు?.. ఆఫీసులో రోజుకి 12 గంటల పని

మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఐదుసార్లు మార్చారని చెప్పారు. అలాగే, పరీక్షా పత్రాల మూల్యాంకనం తప్పుడు తడకలుగా జరిగిందని ఆయ‌న ఆరోపించారు. తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు కమిషన్‌ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని అభ్యర్థులు భావిస్తున్నారని ఆయ‌న చెప్పారు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం మొదటి మూల్యాంకనం, రెండవ మూల్యాంకనం ఫలితాల్లో 15 శాతం తేడా లేనప్పుడు మూడవ మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఏంటి? అని ఆయ‌న నిల‌దీశారు. తమ అస్మదీయులను అందలం ఎక్కించటం కోసం గ్రూప్‌-1 మెయిన్స్‌లో అక్రమాలకు కొంద‌రు తెరతీశారని ఆయ‌న చెప్పారు.

National Herald Case: ’గాంధీ కుటుంబం ఆస్తుల్ని కాపాడేందుకే కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలు‘ : మంత్రి స్మృతి ఇరాని

మొదటిసారి విడుదల చేసిన ఫలితాలకు, రెండవసారి విడుదల చేసిన ఫలితాలకు మ‌ధ్య‌ భారీ వ్యత్యాసాలు ఉండటంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయ‌న అన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయవలసిందిగా కోరుతున్న‌ట్లు చంద్ర‌బాబు చెప్పారు. గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపికలో సైతం అక్రమాలు జరిగినట్టు పలువురు అభ్యర్థులు ఫిర్యాదులు చేశారని ఆయ‌న అన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవటంతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.