తొలిదశలో రూ.3వేల 700కోట్లతో నాడు-నేడు, జగనన్న గోరుముద్ద కోసం టోల్ ఫ్రీ నెంబర్

  • Published By: naveen ,Published On : June 3, 2020 / 11:03 AM IST
తొలిదశలో రూ.3వేల 700కోట్లతో నాడు-నేడు, జగనన్న గోరుముద్ద కోసం టోల్ ఫ్రీ నెంబర్

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ సహా ఇతర అధికారులు హాజరయ్యారు. నాడు-నేడు కోసం తొలిదశలో రూ.3వేల 700కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నాడు-నేడు జూలై చివరికి పూర్తి చేస్తామని సీఎం చెప్పారని మంత్రి సురేష్ తెలిపారు. నాడు-నేడుకు సంబంధించిన టెండర్లను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. తొలి దశలో నాడు-నేడు కింద 15వేల 700 మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కొత్తగా 500 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నాడు-నేడు దేశ చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. జగనన్న గోరుముద్ద కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు.

పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమాలపై సమీక్ష:
* నాడు-నేడు కార్యక్రమాల్లో నాణ్యతను ఎలా పెంచాలన్న దానిపై దృష్టి పెట్టాలని, దీని కోసం ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం.
* ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున, జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలన్న సీఎం
* నాడు-నేడు కింద పాఠశాలల నిర్మాణాల్లో నాణ్యత కోసం పాటించాల్సిన పద్దతులు, విధివిధానాలను ఎస్‌ఓపీలుగా రూపొందించి వాటిని సంబంధిత విభాగాలకు పంపించాలన్న సీఎం.
* గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌నూ భాగస్వామ్యం చేయాలన్న సీఎం.
* గవర్నమెంటు అంటే నాసిరకం కాదు.. గవర్నమెంటు అంటే క్వాలిటీ అన్న పేరు రావాలన్న ముఖ్యమంత్రి. 
* నాడు-నేడు నా మనసుకు చాలా నచ్చిన కార్యక్రమం అన్న సీఎం.
* నాడు-నేడు పనులకు సంబంధించి రూ.533 కోట్లు పేరెంట్స్‌ కమిటీల ఖాతాల్లో ఉన్నాయన్న అధికారులు.
* గుంటూరు జిల్లాలో అత్యధిక నిధులు ఖర్చయ్యాయని, లాక్‌డౌన్‌ సడలింపులతో గతవారం నుంచి పనుల్లో వేగం పెరిగిందని అధికారుల వెల్లడి.
* ప్రత్యేకంగా జేసీలను నియమించడం వల్ల పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు

విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు:
* విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచాలని, రీ పొజిషన్‌ చేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతిపాదనలను సీఎం ముందుంచిన అధికారులు.
* విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశం
* ఏయే పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలన్న సీఎం.
* టీచర్ల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
* విద్యార్థుల అవసరాలే ప్రాతిపదికగా టీచర్ల బదిలీలు చేపట్టాలన్న సీఎం
* జూలై 15 తర్వాత ఆన్‌లైన్‌ లో టీచర్ల బదిలీలు
* పిల్లలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకోమన్న ముఖ్యమంత్రి
* అధికారులు అంతా కూర్చొని టీచర్ల రీ పొజిషన్‌కు పిల్లలకు మంచి చేసే ఉద్దేశంతో విధివిధానాలు రూపొందించాలన్న సీఎం
* 2017లో అనుసరించిన పద్దతులు కారణంగా 7,991 స్కూళ్లకు సింగిల్‌ టీచర్‌ను కేటాయించారని, వీటిలో చాలావరకు మూతబడ్డాయని సమావేశంలో ప్రస్తావన. 
* ప్రభుత్వ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేయాలి. విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు ఎలా పంపాలన్న కోణంలో అప్పుడు నిర్ణయాలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగిందన్న సీఎం 
* అక్టోబర్, నవంబర్ వచ్చినా యూనిఫామ్స్, పుస్తకాలు ఇవ్వలేదన్న సీఎం
* ఇప్పుడు పిల్లలకు మంచి చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నామన్న సీఎం.

పిల్లల ప్రతిభపై నిరంతర అధ్యయనం:
* పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపే ప్రతిభపై నిరంతరం అధ్యయనం జరగాలన్న సీఎం. 
* 6వ తరగతి నుంచి 10 తరగతి వరకూ వివిధ పాఠశాల్లలో విద్యార్థుల ప్రతిభపై నిరంతరం అధ్యయనం చేయాలన్న సీఎం
* విద్యార్థులకు వస్తున్న మార్కులు, వారు చూపిస్తున్న ప్రతిభపై సమాచారాన్ని సేకరించి ఆ డేటాను అనలైజ్‌ చేయాలని, ఏయే సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనకబడి ఉన్నారో గుర్తించి.. నేర్చుకోవడంలో వారికున్న సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక పద్ధతులు, విధానాలను రూపొందించాలని ఆదేశించిన సీఎం.
* ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అందడానికి నిర్ణయాలు తీసుకోవడంలో విప్లవాత్మకంగా ఆలోచించాలన్న అధికారులకు స్పష్టం చేసిన సీఎం. 
* డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన చేయాలని ఆదేశించిన సీఎం.
* విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్‌ సదుపాయం కూడా ఉండేలా చూడాలన్న ముఖ్యమంత్రి. 
* ఈ అంశాల మీద అధికారులు దృష్టి పెట్టాలని, భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయన్న సీఎం.
 
స్కూల్లో సదుపాయాలపై టోల్‌ ఫ్రీ నంబర్‌:
* గోరుముద్ద కింద పిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజనం ఏ స్కూల్లో చూసినా ఒకటే నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలని ఆదేశించిన సీఎం.
* వీటికిచ్చే పేమెంట్ల విషయంలో ఎలాంటి ఆలస్యం ఎండకూడదని పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి. 
* జేసీలు, కలెక్టర్లు మధ్యాహ్న భోజనంపై నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని, దీన్ని విధిగా పాటించేలా ఆదేశాలు ఇవ్వాలన్న సీఎం
* స్కూల్లో సదుపాయాలపై టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలన్న సీఎం. ఏ సమస్య ఉన్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ నెంబరుకు ఫోన్‌ చేసేలా నెంబరును ప్రదర్శించాలన్న సీఎం. తల్లిదండ్రులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్న సీఎం.
* పాఠశాలలు పరిశుభ్రంగా, అలాగే బాత్‌రూమ్స్‌ కూడా శుభ్రంగా ఉంచడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్న సీఎం.
* జగనన్న విద్యా కానుక కోసం జూన్ 8, 9 తేదీల్లో విద్యార్థుల కాళ్ల కొలతలు తీసుకుంటున్నట్లు అధికారుల వెల్లడి.

Read: ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పెంపు