AP Covid : ఏపీలో కరోనా ముగిసినట్టేనా.. 25 జిల్లాల్లో సున్నా కేసులు

ఏపీలో తాజాగా... 2 వేల 941 శాంపిల్స్ పరీక్షిస్తే.. కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైందని ఫ్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది...

AP Covid : ఏపీలో కరోనా ముగిసినట్టేనా.. 25 జిల్లాల్లో సున్నా కేసులు

Ap Corona

Andhra Pradesh Covid 19 Cases : ఏపీలో కరోనా పీక్ ముగిసినట్లేనని అనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గిపోతున్నాయి. తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో లక్షలు, వేలు సంఖ్యలో ఉండగా.. ఇప్పుడు సింగిల్ డిజిట్ కు చేరుకుంది. దీంతో ప్రజలు ఊపరిపీల్చుకుంటున్నారు. కానీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మాత్రం అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ ముంచుకొస్తుందా ? అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఏపీలో తాజాగా… 2 వేల 941 శాంపిల్స్ పరీక్షిస్తే.. కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైందని ఫ్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 04 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,35,05,128 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : CM Jagan : అన్ని విభాగాలు క్లీన్ కావాల్సిందే.. సీఎం జగన్ ఆదేశాలు

జిల్లాల వారీగా కేసులు : అల్లూరి సీతరామరాజు 00, అనకాపల్లి 00, అనంతపురం 00, అన్నమయ్య 00, బాపట్ల 00, చిత్తూరు 00, ఈస్ట్ గోదావరి 00, ఏలూరు 00, గుంటూరు 00, కాకినాడ 00, కొనసీమ 00, కృష్ణా 00, కర్నూలు 00, నంద్యాల 00, ఎన్టీఆర్ జిల్లా 000, పల్నాడు 00, పార్వతీపురం మణ్యం 00, ప్రకాశం 00, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 00, శ్రీ సత్యసాయి 00, శ్రీకాకుళం 00, తిరుపతి 00, విశాఖపట్టణంలో 01, విజయనగరం 00, వెస్ట్ గోదావరి 00, వైఎస్సార్ జిల్లా 00. మొత్తం : 01