ఏపీలో కరోనా కేసులు 664 మాత్రమే

ఏపీలో కరోనా కేసులు 664 మాత్రమే

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ సంఖ్య తగ్గినట్లుగా కనిపిస్తుంది. బుధవారం రోజు మొత్తంలో 63వేల 49మందికి జరిపిన టెస్టుల్లో అన్ని రకాల శాంపుల్స్ కలిపి 664మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ కోవిడ్ కారణంగా చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు, కడపలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు మృతి చెందినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే గడిచిన 24గంటల్లో కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 835గా నమోదైంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ కోటి 2లక్షల 29వేల 745మంది శాంపుల్స్ పరీక్షించారు.