రాజమండ్రిలో కరోనా న్యూ స్ట్రెయిన్ టెన్షన్..!
Covid New Strain Tension Rajahmundry : రాజమండ్రిలో కరోనా న్యూ స్ట్రెయిన్ టెన్షన్ పట్టుకుంది. యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నెల 21న యూకే నుంచి మహిళ ఢిల్లీ వచ్చింది. అక్కడే మహిళను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. రిపోర్టులు రాకముందే క్వారంటైన్ నుంచి మహిళ తప్పించుకునిపోయింది.
ఢిల్లీ-విశాఖ స్పెషల్ ట్రైన్లో రాజమండ్రికి మహిళ వచ్చింది. మొబైల్ స్విచాఫ్ చేసి ఉండటంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో రాజమండ్రికి క్వారంటైన్ నుంచి తప్పించుకున్న మహిళ చేరుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
రాజమండ్రి చేరుకోగానే పోలీసులు ఆమెను గుర్తించారు. మహిళతో పాటు ఆమె కుమారుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరోనా పాజిటివ్తో 1800కిలోమీటర్ల వరకు ట్రైన్లోనే బాధిత మహిళ ప్రయాణించినట్టు పోలీసులు చెబుతున్నారు.