Earthquake : విశాఖలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అక్కయ్యపాలెం, అల్లిపురం. అసిల్మెట్ట, సీతమ్మధార, రైల్వేస్ స్టేషన్, మధురానగర్లో ఉదయం 7.15 సమయంలో కంపించింది భూమి
Earthquake : విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అక్కయ్యపాలెం, అల్లిపురం. అసిల్మెట్ట, సీతమ్మధార, రైల్వేస్ స్టేషన్, మధురానగర్, జ్ఞానాపురం, బంగారమ్మమెట్ట, సింహాచలం, అడవివరం, గోపాలపురం ప్రాంతాల్లో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించింది. ఉదయం 7.15 సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
చదవండి : Visakha : స్టీల్ ప్లాంట్ ఆస్తుల వాల్యుయేషన్ కమిటీ సభ్యుల రాక..గేట్ల దిగ్భందానికి పిలుపు
ఈ సమయంలో భారీ శబ్దాలు వచ్చినట్లు తెలిపారు. ఇంట్లోని సామాను కిందపడటంతో భూకంపం వచ్చినట్లు అర్థమైందని వెంటనే బయటకు పరుగులు తీసినట్లు స్థానికులు తెలిపారు. ఇక కొన్ని ఇళ్లకు పెచ్చులు ఊడి పడగా, మరికొన్ని ఇళ్లకు నెర్రలు వచ్చాయి.
చదవండి : Visakhapatnam : సింహాద్రి ఎన్టీపీసీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి