Tirumala Rush: తిరుమలలో పోటెత్తిన భక్తజనం: భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలన్న టీటీడీ అధికారులు
శనివారం తిరుమలలో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్మెంట్ నిండిపోయాయి

Tirumala Rush: తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులుతరలివస్తున్నారు. శనివారం తిరుమలలో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్మెంట్ నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపలకు బారులు తీరారు భక్తులు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామి వారి దర్శనం ఆలస్యం అవుతుంది. శనివారం క్యూలోకి వెళ్లిన భక్తులకు 48 గంటలకు పైగా దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నట్లు టీటీడీ సిబ్బంది తెలిపారు. వారాంతం కావడం, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పరీక్షలు పూర్తవడంతో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో వేంకటేశ్వరుడి దర్శనానికి తరలివచ్చారు.
other stories: TTD : టీటీడీ గోడౌన్ లో చైర్మన్ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు..నాణ్యత లేని జీడిపప్పు సరఫరా కంపెనీ టెండర్ రద్దుకు ఆదేశాలు
దీంతో తిరుమల కొండపై ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సోమవారం సాయంత్రం వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు పలు సూచనలు చేసారు. కొండపై అనూహ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది. అదే సమయంలో సాధారణ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీలు సైతం తమ దర్శన ఏర్పాట్లలో మార్పులు చేసుకోవాలని కూడా టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
other stories: Sabza Nut Water : వేసవిలో సబ్జా గింజల నీళ్లు ఆరోగ్యానికి మేలే!
తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరగడంపై టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి భక్తుల క్యూ లైన్లను పరిశీలించారు. వైకుంఠ ఏకాదశి, గరుడసేవ రోజులకన్నా భక్తుల రద్దీ అధికంగా ఉందని, ప్రతి గంటకు 8 వేల మంది భక్తులు క్యూలైన్లలో ప్రవేశిస్తున్నారని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. గంటకు నాలుగు నుండి నాలుగున్నర వేల మందికి మాత్రమే శ్రీవారి దర్శనం లభించే అవకాశం ఉందని.. ఈలెక్కన క్యూలైన్లలో ఇప్పుడున్న భక్తులకు శ్రీవారి దర్శనానికి రెండు రోజులు సమయం పడుతుందని ఈఓ పేర్కొన్నారు. భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ అధికారులు గట్టిగా సూచిస్తున్నారు. అధిక రద్దీ కారణంగా తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు.
- Srivari Arjitha Seva Tickets : జూన్ 27న సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
- Srinivasa Kalyanam : డల్లాస్లో వైభవంగా శ్రీనివాసకళ్యాణం
- College Admissions : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి జూన్ 25 నుండి దరఖాస్తుల ఆహ్వానం
- Job Notification : ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బోధనా సిబ్బంది పోస్టులకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ
- TTD: ఆగష్టు 7న జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణమస్తు
1Pakistan Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 19మంది మృతి
2Telangana: 10 సభలు పెట్టినా బీజేపీని ఎవరూ నమ్మరు: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
3Rains In Telangana : రాగల 24 గంటల్లో అల్పపీడనం-తెలంగాణలో పలు జిల్లాలలో వర్షాలు
4Gold Theft : కేజీన్నర బంగారం చోరీని చేధించిన పోలీసులు
5Texas shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
6PM Modi Bhimavaram Tour : రేపు భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఖరారు
7bjp: కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంది: జేపీ నడ్డా
8PM Narendra Modi : తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తాం-నరేంద్ర మోదీ
9IndvsEng 5thTest : 284 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్కు భారీ లీడ్
10Burglar : దొంగతనానికి వచ్చి ఇంట్లో మంచం కింద నిద్రపోయిన దొంగ
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు