IT Raids: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇండ్లలో తనిఖీలు

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడలో మంగళవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇండ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇండ్లలో తనిఖీలు

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఇళ్లల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడల్లో వేర్వేరు ఐటీ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Supreme Court: ఛారిటీ అంటే మత మార్పిడి చేయడం కాదు.. బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ పరిధిలో ఉన్న వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి నివాసంతోపాటు, అతడి కార్యాలయం, బంధువుల ఇండ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. సుబ్బారెడ్డి బావ మరిది జనార్ధన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఏపీలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపై కూడా అధికారులు దాడి చేసి, సోదాలు నిర్వహిస్తున్నారు. వంశీకి సంబంధించి మూడు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి.

అలాగే విజయవాడ పరిధిలోని వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినాష్ బంజారాహిల్స్‌లోని తన భూమిని డెవలప్‌మెంట్ కోసం వంశీరాం బిల్డర్స్‌కు ఇచ్చాడు. దీంతో అతడి ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.