ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..జెడ్పీ, ఎంపీపీ స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..జెడ్పీ, ఎంపీపీ స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు

Key orders of the AP government : ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో జెడ్పీ, ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో ఆరు నెలల పాటు ప్రత్యేక పాలన పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం మండల పరిషత్‌లో జూలై 3 వరకు, జిల్లా పరిషత్‌లో జూలై 4 వరకూ ప్రత్యేక అధికారుల పాలన ఉండనుంది. ఈ మేరకు పంజాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి గత కొన్ని రోజులుగా వివాదం జరుతుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంటే, ప్రభుత్వం దీనికి ససేమిరా అంటోంది.

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా లేమని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.