నాకు కరోనా లేదు : హైదరాబాద్కు కర్నూలు యువతి అన్నం జ్యోతి
చైనాలోని వుహాన్లో చిక్కుకున్న కర్నూలు యువతి అన్నెం జ్యోతి… హైదరాబాద్ చేరుకుంది. చైనా నుంచి 15 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన జ్యోతి… ఇన్నిరోజులు మానేసర్లోని వైద్యుల పరిశీలనలో ఉంది. అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో పంపించేశారు. దీంతో హైదరాబాద్ చేరుకున్న జ్యోతి.. 2020, మార్చి 14వ తేదీ శనివారం స్వగ్రానికి చేరుకోనుంది.
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్ లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని.. వివిధ పరిణామాల మధ్య ఇండియాకు తీసుకొచ్చారు. 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం విమానంలో భారత్కు వస్తునట్లు జ్యోతి తమ కుటుంబ సభ్యులతో చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆమెను ప్రత్యేక వార్డుల్లో ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకోవడంతో జ్యోతిని స్వగ్రామానికి పంపించారు.
కరోనా వైరస్ విజృంభించడంతో.. చైనాలోని చిక్కుకున్న భారతీయులను స్వదేశం చేర్చేందుకు మొదట రెండు ఎయిరిండియా విమానాలు అక్కడకు వెళ్లాయి. కానీ.. జ్యోతిని తీసుకొచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఆమెకు కరోనా వైరస్ సోకిన లక్షణాలు ఉన్నాయని అందుకే ఆమెను తీసుకురావడం లేదని విమాన సిబ్బంది తెలిపారు. దీంతో కుంటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
Also Read | ‘దేవుళ్లకు కోపం ఎక్కువే సుమా’..కరోనాపై నాగబాబు
అయితే తనకు స్వల్ప జ్వరం మాత్రమే వచ్చిందని.. కరోనా సోకలేదని, తనను వెంటనే భారత్కు చేర్చాలని ఆమె సెల్ఫీ వీడియోలో భారత ప్రభుత్వాన్ని కోరింది. అటు ఆమె తల్లిదండ్రులు, కాబోయే భర్త అమరనాథ్ రెడ్డి కూడా భారత అధికారులను అభ్యర్థించారు. మరోవైపు వివాహం కూడా వాయిదా పడింది. చివరకు వూహాన్ చేరిన ఎయిరిండియా విమానం.. ఇతర భారతీయులతో పాటు అన్నెం జ్యోతిని కూడా ఇండియాకు తీసుకొని వచ్చారు. ఇటీవలే సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన జ్యోతి ట్రైనింగ్ కోసం చైనాలోని వూహాన్ నగరానికి వెళ్లింది. అదే సమయంలో కరోనా వైరస్ విజృంభించడంతో ఆమె అక్కడే చిక్కుకపోయింది.
Read More : పజిల్ : ఈ ఫొటోలో ఎన్ని పులులు కనిపిస్తున్నాయి