Loss To TTD : భారీ వర్షాలతో టీటీడీకి రూ.4 కోట్లకు పైగా నష్టం

భారీ వర్షాల వల్ల తిరుమలలో రూ.4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు.

Loss To TTD : భారీ వర్షాలతో టీటీడీకి రూ.4 కోట్లకు పైగా నష్టం

Ttd

Loss Rs.4crore to TTD : భారీ వర్షాల వల్ల తిరుమలలో రూ.4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. నవంబరు 17 నుంచి 19 వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యాములు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపుకు గురి చేశాయని ఆయన తెలిపారు.

మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బ తిన్నదని, ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. టీటీడీ సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలగించి, తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారని ఆయన చెప్పారు. రెండవ ఘాట్ రోడ్ లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయని తెలిపారు. ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు. టీటీడీ అధికారులు, సిబ్బంది ఈ ఘాట్ రోడ్డులో కూడా కొండ చరియలను తొలగించి, ట్రాఫిక్ ను పునరుద్ధరించారని చెప్పారు.

Building Collapse : కదిరిలో భవనాలు కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతి

తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయన్నారు. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించారని వివరించారు. భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గంలో రోడ్డు, ఫుట్ పాత్ దెబ్బతిన్నాయన్నారు.

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడతో పాటు రాంనగర్, వినాయక నగర్, జి ఎంబి క్వార్టర్స్, శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నట్లు ఆయన తెలిపారు. కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతిందని, దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారన్నారు.

Swachh Bharat Awards : ఏపీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డుల పంట

వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు. ఐటీ విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి, భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారని ఆయన చెప్పారు. స్వామివారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశామన్నారు.

టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల, తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.