Minister Kannababu : వర్షాలు తగ్గగానే పంట నష్టం అంచనా వేయండి-మంత్రి కన్నబాబు

రాష్ట్రంలో వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టాలని పక్కాగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు.

Minister Kannababu : వర్షాలు తగ్గగానే పంట నష్టం అంచనా వేయండి-మంత్రి కన్నబాబు

Kurasala Kannababu

Minister Kannababu :  రాష్ట్రంలో వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టాలని పక్కాగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఈ వర్షాలు కూడా ఖరీఫ్ కు కలిసొచ్చే అంశం అని ఆయన అన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందితో వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులను టెలీ కాన్ఫెరెన్స్ ద్వారా కన్నబాబు అడిగి తెలుసుకున్నారు. ఏ రైతు ఈ వర్షాల వల్ల నష్టపోకుండా చూడాలని ఆదేశించారు.  అనంతపురం జిల్లాలో ఆగస్టు 5వ తేదీ వరకు సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. రైతులకు ఇచ్చే ప్రతి విత్తనం నాణ్యమైనదై ఉండాలని, ద్రువీకరించినదై ఉండాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ, ఉద్యాన వన శాఖల ఉన్నతాధికారులతో విత్తనోత్పత్తి , వర్షాల వల్ల నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై మంత్రి కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య లు ఏపిఐఐసి బిల్డింగ్ లో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ విత్తన నాణ్యతకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. రైతు బరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి చేయనున్నామన్నారు.

విత్తనాలు పండించే రైతులు, కంపెనీల వివరాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. విత్తనం పండించే ప్రతి ఎకరం రిజిస్ట్రేషన్ చేస్తామని, అలాగే ప్రాచుర్యం పొందిన హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని కన్నబాబు తెలిపారు. రాష్ట్రాన్ని విత్తన హబ్ గా చేసేందుకు సీడ్స్ నూతన పాలసీ తోడ్పడుతోందన్నారు. ఇతర రాష్ట్రాలకు సీడ్స్ మార్కెటింగ్ చేసేలా ప్రణాళికలు చేయాలని అధికారులను ఆదేశించారు.

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. జులై 22 వరకు 200.3 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉంటే 256 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. అత్యధికంగా అనంతపురం, చిత్తూరు, కడప లో వర్షాలు పడ్డాయన్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణ, కర్నూల్ లో అధిక వర్షపాతం నమోదైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో ముంపుకి గురయ్యాయని…. వర్షం నిలిస్తే ఆ నీరు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. వర్షాలు తగ్గితే పూర్తిగా ఎన్యుమరేషన్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.