Sajjala : ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారు

ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పీఆర్‌సీ నివేదికపై ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా..

Sajjala : ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారు

Sajjala

Sajjala : ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పీఆర్‌సీ నివేదికపై ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్‌సీపై కసరత్తు ముమ్మరంగా జరుగుతోందన్నారు. దీనిపై సీఎం జగన్‌ తో చర్చిస్తున్నట్లు సజ్జల తెలిపారు. త్వరలోనే ఉద్యోగులు శుభవార్త అందుకుంటారని వెల్లడించారు. ఇప్పటికే పీఆర్సీపై ప్రకటన చేయాలనుకున్నామని, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినట్లు వివరించారు.

Wi-Fi HaLow : సరికొత్త వై-ఫై టెక్నాలజీ వస్తోంది.. కిలోమీటర్ దూరంలోనూ Wi-Fi కనెక్ట్ కావొచ్చు!

కాగా, రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎస్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాలతో సామరస్యంగానే పరిష్కరించుకుంటామన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని సజ్జల హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.