South Central Railway: ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో.. 9వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు
ఈనెల 9వ తేదీ వరకు పలు రూట్లలో వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల వివరాలను అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
Trains Cancelled: ఒడిశాలోని బాలసోర్ జిల్లా బహన్గా బజార్ స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మూడు రైళ్లు ఢీకున్న ఘటనలో సుమారు 280 మంది మృతి చెందారు. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గత ఐదు రోజులుగా పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్లను గమ్యస్థానాలను మార్చారు. తాజాగా రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం అయినప్పటికీ.. సాంకేతిక కారణాలతో పలు రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఈనెల 9వ తేదీ వరకు పలు రూట్లలో వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల వివరాలను అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.