AP Assembly : అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా ? వద్దా ?

మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టనంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఆయన శపథం చేస్తూ...

AP Assembly : అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా ? వద్దా ?

Tdlp Meeting

TDLP Meeting : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 07వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 11వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతుండడంతో అందరి దృష్టి టీడీపీపై నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరవుతారా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. ఈ క్రమంలో టీడీఎల్పీ సమావేశం కాబోతోంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుదామా ? లేదా ? అనే దానిపై శాసనసభా పక్షం చర్చించనుంది. 2022, మార్చి 05వ తేదీ శనివారం బాబు అధ్యక్షతనలో ఈ భేటీ జరుగనుంది. చట్ట సభలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More : AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. మార్చి 7నుంచి!

మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టనంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఆయన శపథం చేస్తూ.. వెళ్లిపోయారు. దీంతో ఆయన సభకు హాజరయ్యే అవకాశం లేదు. చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరుపై పార్టీలో గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం ఆన్ లైన్ లో జరిగే భేటీలో తుది నిర్ణయం టీడీఎల్పీ తీసుకోనుంది. సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై టీడీఎల్పీలో చర్చించి బాబు ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Read More : Andhra Pradesh : ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్

మార్చి 7వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనుండగా.. మార్చి 8వ తేదీన గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సభ సంతాపం తెలపబోతుంది. మార్చి 11వ తేదీన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశముంది. రూ.2.30లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టాన్ని అసెంబ్లీ ప్రవేశపెడుతారని ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన క్రమంలో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే ఉత్కంఠ నెలకొంది.