Employees Transfer : తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏపీకి శాశ్వత బదిలీకి ప్రభుత్వం అనుమతి

రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత బదిలీపై వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Employees Transfer : తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏపీకి శాశ్వత బదిలీకి ప్రభుత్వం అనుమతి

Telangana (2)

Telangana Government approve : రాష్ట్రంలో  పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత బదిలీపై వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం (సెప్టెంబర్13, 2021) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఉద్యోగులను బదిలీపై ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.

క్షమశిక్షణ చర్యలు, విజిలెన్స్‌ కేసులు పెండింగులో ఉన్నవారికి మాత్రం ఈ అవకాశం ఉండదని స్పష్టం చేసింది. శాశ్వత బదిలీల కోసం పాటించాల్సిన నిబంధనలపై ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు దీనిని అమలు చేయాలని ఆదేశించింది. ఉద్యోగులు బదిలీ కోసం వచ్చేనెల 15లోగా ధరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది.

Telangana : గురుకుల ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలోని పలువురు ఉద్యోగులు, అధికారులు ఏపీకి వెళ్లేందుకు తమను అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొదట్లో డిప్యుటేషన్‌, అంతరరాష్ట్ర బదిలీల కింద కొందరిని ఏపీ ప్రభుత్వం అనుమతించింది. తాజాగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించి, వారి శాశ్వత బదిలీకి ఆమోదం తెలిపారు. అందుకనుగుణంగా తాజాగా సీఎస్ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో తెలంగాణలో పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లుండగా ఏపీకి బదిలీ కోరుతూ ఉద్యోగుల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇటీవలే తెలంగాణలో పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచారు. ఈ క్రమంలో ఎంతమంది ఉద్యోగులు ఏపీకి శాశ్వత బదిలీలకు ముందుకొస్తారో పరిశీలించి, వారిని అనుమతించే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Telangana govt : రెవెన్యూ కేడర్‌ పెంపుపై తెలంగాణ సర్కార్ ఫోకస్

ఆంధ్రప్రదేవ్ కు వెళ్లాలనుకునే ఉద్యోగులు తమ శాఖల్లో వచ్చే నెల 15వ తేదీలోగా శాఖాధిపతులకు దరఖాస్తు చేసుకోవాలి. వాటిని శాఖాధిపతులు ప్రభుత్వం దృష్టికి తేసుకురావాలి. సంబంధిత శాఖాధిపతి సిఫారసుతో ఉద్యోగి పనిచేసే శాఖ కార్యదర్శి ఏపీ ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం పంపించాలి.

ఏపీ ప్రభుత్వం అనుమతి లభించిన ఉద్యోగులను వెంటనే సంబంధిత శాఖాధిపతి రిలీవ్‌ చేయాలి. ఈ సమాచారాన్ని సర్వీసు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. రిలీవ్‌ అయినవారు శాశ్వతంగా బదిలీ అయినట్లే పరిగణిస్తారు. మళ్లీ వెనక్కి వచ్చేందుకు అవకాశం ఉండదు.