Superstitions : ప్రాణాలు తీస్తున్న మూఢ నమ్మకాలు

మూఢ నమ్మకాలు మనుషులను మృగాలుగా మారుస్తున్నాయి. అనుమానాలు పెను భూతాలుగా మారుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో చిల్లంగి చేశారన్న అనుమానం ముగ్గురిని బలితీసుకుంది.

Superstitions : ప్రాణాలు తీస్తున్న మూఢ నమ్మకాలు

Kill

Three murdered in visakha district : మూఢ నమ్మకాలు మనుషులను మృగాలుగా మారుస్తున్నాయి. లేనిపోని అనుమానాలు పెను భూతాలుగా మారుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో చిల్లంగి చేశారన్న అనుమానం ముగ్గురిని బలితీసుకుంది. బగ్మారవలసలోని రెండు కుంటుంబాల మధ్య చిచ్చు రేపింది. చిల్లంగి చేస్తున్నారనే అనుమానంతో కోమటి కుటుంబంపై గొల్లోరి డొంబు ఫ్యామిలీ కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

బగ్మారవసలకు చెందిన కిల్లో కోమటి చిల్లంగి చేస్తుంటాడని గొల్లోరి డొంబు, అతని కుటుంబీకులు అనుమానం పెంచుకున్నారు. దీంతో కొద్దిరోజులుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం డొంబు కుటుంబ సభ్యులు.. కోమటి ఫ్యామిలీపై దాడికి దిగారు. కోమటి పెద్ద కుమారుడైన బలరామ్‌పై డొంబు కొడుకు సుబ్బారావు కత్తితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు కోమటి ప్రయత్నించగా… అతడి ఛాతిపై పొడిచాడు. దీంతో కోమటి స్పాట్‌లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
Cyclone : ఏపీకి తుపాను గండం

కోమటి మరో కుమారుడు భగవాన్‌పైనా సుబ్బారావు కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆగ్రహించిన కోమటి కుటుంబ సభ్యులు, బంధువులు.. గొల్లోరి డొంబు, సుబ్బారావులపై దాడి చేశారు. ఈ గొడవలో మొత్తం ముగ్గురు చనిపోగా.. మరో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కోమటి ఇద్దరు కుమారుల పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వారిని కేజీహెచ్‌కు తరలించారు.