శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు ఏకాంతం – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

  • Published By: murthy ,Published On : August 29, 2020 / 07:32 AM IST
శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు ఏకాంతం – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌‌నున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి సాలకట్ల బ్ర‌హ్మోత్స‌వాలను కోవిడ్ కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.



అక్టోబ‌ర్‌లో నిర్వ‌హించే న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్సవాల‌ను అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎలా నిర్వ‌హించాలో నిర్ణ‌యిస్తామ‌న్నారు. తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సుబ్బారెడ్డి వెల్లడించారు.

> శ‌నివారం ఆగస్ట్ 29 నుండి తిరుప‌తిలో 3వేల ఉచిత శ్రీ‌వారి ద‌ర్శ‌న టోకెన్లు మంజూరు చేస్తాం.
> శ్రీ‌‌వారి వైభ‌వాన్ని విశ్వ వ్యాప్తం చేయడంలో భాగంగా కాశ్మీర్ నుండి క‌న్యాకుమారి వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో స్థానిక భ‌క్తుల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ, దాత‌ల‌ నుండి విరాళాలు సేక‌రించాల‌ని నిర్ణ‌యించాం.



> టిటిడి ఆదాయం పెంచుకునే ఆలోచ‌న‌లో భాగంగా ఇక‌మీద‌ట న‌గ‌దు, బంగారు డిపాజిట్ల‌లో ప్ర‌తి నెల కొంత మొత్తానికి గ‌డువు తీరేలా బ్యాంకుల్లో జ‌మ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ప్రస్తుత ప‌రిస్థితుల్లో ‌బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీ ఇస్తున్నందు వ‌ల‌న టిటిడి డిపాజిట్ల‌కు ఎక్కువ వ‌డ్డీ వ‌చ్చేలా ఆర్‌బిఐ, ఇత‌ర బ్యాంకుల‌తో చ‌ర్చించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం.

> బ‌ర్డ్ ఆసుప‌త్రిలో కీళ్ల మార్పిడి శ‌స్త్ర చికిత్స చేసుకున్న వారి కోసం రూ. 5.4 కోట్లతో బ‌ర్డ్ ‌ప‌రిపాల‌న భ‌వ‌నం 3వ అంత‌స్తులో 50 ప్ర‌త్యేక గ‌దుల నిర్మాణానికి ఆమోదం. పాత బ్లాక్‌లో చిన్న పిల్లల‌ ఆసుప‌త్రిని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించాం. త్వ‌ర‌లో శ్వాశ‌త భ‌వ‌న‌లు నిర్మిస్తాం.
> విశాఖ దివ్య క్షేత్రం ఘాట్ ర‌హ‌దారికి వాలు గోడ‌ల నిర్మాణానికి రూ.4.95 కోట్లతో ‌ఆమోదం. క‌రోనా ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చాక ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా ఈ ఆల‌యానికి మ‌హా కుంబాభిషేకం నిర్వ‌హిస్తాం.



ttd board meeting 2> భువ‌నేశ్వ‌ర్ ఆల‌యానికి త్వ‌ర‌లో మ‌హా కుంబాభిషేకం నిర్వ‌హించి, ముంబైలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి శంఖుస్థాప‌న చేస్తాం. వార‌ణాశిలో శ్రీవారి ఆల‌య నిర్మాణం కొసం భూమి కేటాయించాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ‌నికి లేఖ రాశాము. జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం భూమి కేటాయించింది. ఇక్క‌డ కూడా త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభిస్తాం.

> రాష్ట్రంలోని దేవాదాయ‌శాఖ‌, టిటిడి, వివిధ ధార్మిక సంస్థ‌లు నిర్వ‌హిస్తున్న వేద పాఠశాల‌ల‌ను ఒకే గొడుగు కింద‌కు తెచ్చి, వేద విశ్వ విద్యాల‌యం ఆధ్వ‌ర్యంలో కామ‌న్ సిల‌బ‌స్ త‌యారుచేసి సంహిత (10వ త‌ర‌గ‌తి), మూలము (ఇంట‌ర్ మీడియేట్) ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఒకే స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం.
https://10tv.in/lord-venkateswara-temple-in-jammu-chairman-inspects-site-of-proposed/
> కోవిడ్ స‌మ‌యంలో కూడా ప్రాణ‌ల‌కు తెగించి ప‌‌ని చేస్తున్న టిటిడి ఉద్యోగుల‌కు ఉద్యోగుల ఆరోగ్య ప‌థ‌కం (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌) అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించాం.
> క‌రోనా బారిన ప‌డిన టిటిడి ఉద్యోగులు ప్రైవెట్‌ఆసుప‌త్రిలో వైద్యం చేయించుకుంటే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం బిల్లులు చెల్లించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాము.



> కోవిడ్ కార‌ణంగా శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు ర‌ద్ధు చేయ‌డం వ‌ల‌న ఇప్ప‌టికే ఉద‌యా‌స్త‌మాన సేవ మ‌రియు వింశ‌‌తి వ‌ర్ష ద‌ర్శిని ప‌థ‌కాల టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు ప్రొటోకాల్ విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాము.
> తిరుమ‌ల‌లో ‌ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కొర‌కు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్‌ను కొత్త టెక్నాల‌జితో అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించాం. ఇందుకోసం టిటిడి పాల‌క మండ‌లి స‌భ్యురాలు శ్రీ‌మ‌తి సుధా నారాయ‌ణ‌ మూర్తి కోటి రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించారు. బ‌యో డిగ్రేడ‌బుల్ త‌డి చెత్త నుండి వ‌చ్చే సేంద్రియ ఎరువును విక్ర‌యించ‌డానికి లైసెన్స్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించాం. లాభం లేకుండా రైతుల‌కు ఈ ఎరువు అందిస్తాం.

> టిటిడి గో సంర‌క్షణ‌‌కు విశేష ప్రాదాన్య‌త ఇస్తొంద‌ని, పాల‌క మండ‌లి స‌భ్యులు శ్రీ శివ‌కుమార్ గుడికో గో మాత అందించే ప్ర‌తిపాద‌న చేశార‌ని, దీనిపై స‌మావేశంలో సుదీర్ఘంగా చ‌ర్చించి ఈ కార్య‌క్ర‌మాన్ని ఎలా అమ‌లు చేయాలో ఆలోచించాల‌ని అధికారుల‌ను అదేశించాము. గోవ‌ధ నిషేధాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని, అన‌ధికార గోవ‌ధ శాల‌లు మూసి వేయాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ల‌కు లేఖ రాయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. అని    చైర్మన్ తెలిపారు.