కర్నూలు పరువు హత్య కేసులో ఇద్దరు అరెస్ట్!

కర్నూలు పరువు హత్య కేసులో ఇద్దరు అరెస్ట్!

arrested

కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఆడమ్ స్మిత్ పరువు హత్య కేసులో.. ఇద్దరని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆడమ్ స్మిత్ భార్య మహేశ్వరి తండ్రి చిన్న ఈరన్న, పెదనాన్న పెద్ద ఈరన్నలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నిందితులపై 302, 325 సెక్షన్లతోపాటు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. రెండు నెలల క్రితమే 2020 నవంబరు 11న ప్రేమించి వివాహం చేసుకున్న ఫిజియోథెరపిస్టు ఆడమ్ స్మిత్‌ను దారుణంగా బండరాళ్లతో కొట్టి చంపేశారు దుండగులు.

తన తల్లిదండ్రులే తన భార్తను హత్య చేశారంటూ బాధితుడి భార్య ఇచ్చిన వాంగ్మూలం మేరకు వారిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదోనీ పట్టణంలోని కిష్టప్పనగర్‌కు చెందిన ఆడమ్‌ స్మిత్‌‌ని దుండగులు బండరాయితో కొట్టి చంపేశారు.

నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన ఆడమ్‌స్మిత్‌.. ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన మళ్లీశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి కులాలు వేరు కాగా.. అమ్మాయి తరుపు కుటుంబం అప్పటి నుంచి వీరిద్దరిపై ఆగ్రహంతో ఉంది.

వివాహం తర్వాత నూతన దంపతులిద్దరూ కిష్టప్పనగర్‌లోనే ఉంటుండగా.. గురువారం(31 డిసెంబర్ 2020) ఆడమ్ స్మిత్ తన విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా చంపేశారు.