Undavalli : అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందా ? – ఉండవల్లి
అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందని అనుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Undavalli Arun Kumar : అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందని అనుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. సీఎం అయిన తరువాతే వస్తానని అన్నారు..వచ్చి ఏ చేస్తారు అంటూ సూటిగా ప్రశ్నించారు. మానసికంగా దెబ్బతిన్న వాళ్ళే అసెంబ్లీలో అలా కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. ఇటీవలే అసెంబ్లీలో జరిగిన పరిణామాల క్రమంలో…టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో బోరున విలపించిన సంగతి తెలిసిందే. తన కుటుంబాన్ని వైసీపీ నేతలు అవమాన పరుస్తున్నారంటూ…ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో..ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాజీ ఎంపీ ఉండవల్లి స్పందించారు. 2021, నవంబర్ 27వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షంపై ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రతిపక్షం ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని, ప్రతిపక్షాన్ని నాశనం చేయాలనే ఉద్దేశ్యం మాని వారియొక్క సలహాలు తీసుకొంటే…సీఎం జగన్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందన్నారు.
Read More : New Variant omicron : కొత్త వేరియంట్ ను అడ్డుకోవటానికి సీఎం కేజ్రీవాల్ ముందస్తు జాగ్రత్తలు..
మరోవైపు అధికారపక్షంపై కూడా విమర్శలు గుప్పించారు ఉండవల్లి. ఇటీవలే మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సీఎం జగన్ కు అవగాహన లేకే వెనక్కి తీసుకున్నారని చెప్పారు. పార్టీలు ఏకపక్షంగా వ్యవహరించేటప్పుడు అసెంబ్లీ అవసరమా అని నిలదీశారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకపోయిందని, కేంద్రం కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ లో వచ్చే నిధుల్లో..అవకాశం ఏపీ రాష్ట్రం కోల్పోయిందని వివరించారు.
Read More : Tirupati : తిరుపతిలో కుంగుతున్న ఇళ్లు..18 ఇళ్ల గోడలకు పగుళ్లు, బీటలు
రెండు సంవత్సరాలైనా…పోలవరానికి కేటాయించిన నిధులను కేంద్రం నుంచి తేలేకపోవడం దురదృష్టకరమన్నారు. పోలవరం నిధులు ఇవ్వమని కేంద్రం చెప్పిందన్నారు. మరోవైపు..కరెంటు బాకీ కట్టాల్సింది రూ. 25 వేలు కోట్లు కాగా…కాంట్రాక్టర్లకు చెల్లించాల్సింది రూ. 75 వేల కోట్లు అంటూ చెప్పుకొచ్చారు. లంచగొండితనాన్ని నివారించలేకపోవడంతో ప్రభుత్వంపై నిరసన మొదలైందని అభిప్రాయం వెలిబుచ్చారు. ఇటీవలే హత్యకు గురైన వివేకా విషయంలో వస్తున్న ఆరోపణలు, విమర్శలపై కూడా ఆయన స్పందించారు. వివేకా తనకు చాలా అత్యంత సన్నిహితుడని, జగన్ కు సంబంధం లేదని తాను భావిస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి తెలిపారు.
- Polavaram Project : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం
- GST Council : విభజన చట్టం, పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తాం – ఏపీ మంత్రి బుగ్గన
- ఏపీని అప్పుల పాలు చేస్తున్నారు
- TDP Vs YCP : అసలైన పూజ ఏంటో త్వరలో వైసీపీ బ్యాచ్కు అర్థమౌతుంది
- Amaravathi : రాజధాని అంశంపై సీఎం జగన్ సంచలన ప్రకటన..మళ్లీ బిల్లు తీసుకొస్తాం
1Pooja Hegde : పూజాహెగ్డే వెంకటేష్తో ఇక్కడ స్పెషల్ సాంగ్.. అక్కడ చెల్లెలుగా..
2BSF JOBS : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో గ్రూప్ బి పోస్టుల భర్తీ
3Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు
4Viral Video: వామ్మో.. ఇదేందయ్యో.. రెండు రుచులను ఒకేసారి చూడగలదు..!
5RRCAT JOBS : ఆర్ఆర్ సీఏటీలో పోస్టుల భర్తీ
6VZM MLA VS MLC : విజయనగరం జిల్లా YCPలో ఆధిపత్య పోరు..ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య కోల్డ్ వార్
7Nalgonda : కాబోయే భర్త వేధింపులతో యువతి ఆత్మహత్య
8TS Politics : కాంగ్రెస్ వన్ ఫ్యామిలీ వన్ టికెట్ ఫార్మలాతో..తెగ టెన్షన్ పడిపోతున్న తెలంగాణ సీనియర్ నేత
9P Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఇళ్లు, ఆఫీస్లపై సీబీఐ దాడులు
10Chandrababu : లోక్సభ స్థానాలపై చంద్రబాబు ఫోకస్..స్ట్రాంగ్ అభ్యర్ధుల కోసం వెదుకులాట
-
Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!
-
PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే
-
Bajrang Dal camp : బయపెట్టిన బజరంగ్ దళ్ శిక్షణ..ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో కార్యకర్తలకు ట్రెయినింగ్
-
LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్
-
CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్..ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
-
PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి
-
Sourav Ganguly: విరాట్, రోహిత్ల ఫామ్పై బేఫికర్ అంటోన్న గంగూలీ
-
Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!