Gunturu : గుంటూరు జిల్లాలో మహిళ హత్య
విజయవాడ గవర్నమెంట్ ఆస్పత్రిలో అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒక మహిళను ఇద్దరు యువకులు హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
Gunturu : విజయవాడ గవర్నమెంట్ ఆస్పత్రిలో అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒక మహిళను ఇద్దరు యువకులు హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
పోలీసులు అందించిన కధనం ప్రకారం హతురాలు(35) తుమ్మపూడి గ్రామంలో పొలాలకు నీళ్లు పెట్టే పైపుల అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త శ్రీనివాస రావు పనుల కోసం తిరుపతికి వెళ్ళారు. వీరికి ఇద్దరు పిల్లలు.
హతురాలికి అదే గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడితో సన్నిహిత సంబంధం ఉంది. ఈ క్రమంలో సతీష్ తన స్నేహితుడు సాయిరాం తో కలిసి బుధవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వచ్చారు. మొదట సతీష్ ఇంట్లోకి వెళ్లి ఆమెతో సన్నిహితంగా మెలిగి బయటకు వచ్చాడు. అనంతరం రెండో యువకుడు సాయిరాం ఇంట్లోకి వెళ్లి ఆమెను సన్నిహితంగా ఉండమని కోరగా అందుకు హతురాలు అంగీకరించక ఎదురు తిరిగింది.
దీంతో ఆగ్రహించిన సాయిరాం ఆమె చీర కొంగుతో గొంతు బిగించి చంపేశాడు. అనంతరం ఇద్దరు యువకులు ఆమె సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యారు. సమాచారం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్న దుగ్గిరాల పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read : Guntur : తుమ్మపూడిలో మహిళ హత్య.. సర్కార్కు లోకేశ్ డెడ్ లైన్
ఘటనా స్ధలంలో లభించిన ప్రాధమిక ఆధారాలను బట్టి నిందితులను గుర్తించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గురువారం మద్యాహ్నం నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.