YCP MLA: అమరావతి రైతుల పాదయాత్రలో వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్కు అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలనే డిమాండ్తో ‘న్యాయస్థానం to దేవస్థానం’ పాదయాత్ర చేస్తున్నారు రైతులు
YCP MLA: ఆంధ్రప్రదేశ్కు అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలనే డిమాండ్తో ‘న్యాయస్థానం to దేవస్థానం’ పేరుతో అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు సపోర్ట్ చేస్తూ.. పాదయాత్రలో పాల్గొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
రైతుల పాదయాత్ర నెల్లూరు జిల్లాలో జరుగుతోండగా అమరావతి రైతులను నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో, అలాగే సింహపురి రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.
రైతులను కలిసి, వారికి సంఘీభావం ప్రకటించడమే కాదు.. ఏ అవసరం వచ్చినా తనకు చెప్పాలని, అండగా ఉంటానని రైతులకు హామీ ఇవ్వడం.. ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతుంది. భారీ వర్షాల కారణంగా మహా పాదయాత్రకు రైతులు బ్రేక్ ఇవ్వగా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని SSB కళ్యాణ మండపంలో వారు బస చేస్తున్నారు.
అయితే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా వారి వద్దకు వెళ్లి బాగోగులను కనుక్కోవడం ఇప్పుడు రాజకీయంగా గట్టి చర్చకు కారణం అవుతోంది. మూడు రాజధానుల విషయంలో ముందుకు సాగుతామంటూ ఓవైపు వైసీపీ ప్రభుత్వం ప్రకటించినా.. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తున్న రైతులకు సపోర్ట్గా రావడం విశేషం.