ys vijayamma : అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించిన విజయమ్మ

కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మమ్మను సీఎం జగన్ తల్లి విజయమ్మ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అవినాశ్ రెడ్డి కుటుంబం విజయమ్మ కుటుంబం అంతా చాలా దగ్గర బంధువులే అనే విషయం తెలిసిందే.

ys vijayamma : అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించిన విజయమ్మ

komatireddy rajagopal reddy revanth reddy (1)

ys vijayamma ..ys avinash reddy : కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మమ్మను సీఎం జగన్ తల్లి విజయమ్మ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అవినాశ్ రెడ్డి కుటుంబం విజయమ్మ కుటుంబం అంతా చాలా దగ్గర బంధువులే అనే విషయం తెలిసిందే.

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్న అవినాశ్ రెడ్డి పదే పదే సీబీఐ విచారణకు గైర్హాజరు అవుతున్నారు. మే 16వ తేదీన హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే, తనకు ముందస్తు షెడ్యూల్‌లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయని, నాలుగు రోజులు గడువు కావాలంటూ చివరి నిమిషంలో అవినాశ్‌ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో 19న విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతో 19న సీబీఐ విచారణ కోసం అవినాశ్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్న సమయంలో అతని తల్లికి ఆరోగ్యం బాగాలేని ఆస్పత్రిలో చేర్చారని తెలిసి ఆయన హుటాహుటిన తిరిగి వెళ్లిపోయారు.

Supreme Court : ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీష‌న్ విచారణకు నిరాక‌రించిన సుప్రీంకోర్టు

ఆ తరువాత ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. అయినా ఫలితం దక్కలేదు. ఈక్రమంలో మరోసారి అంటే మే 22న మరోసారి ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినా నిరాశే ఎదురైంది. ఇలా పలుమార్లు ముందస్తు బెయిల్ పిటీషన్ విషయంలో చుక్కెదురు కావటంతో అవినాశ్ రెడ్డి ఆందోళనలో ఉన్నారు. ఓ పక్క బెయిల్ పిటీషన్లు పనిచేయకపోవటం..మరోపక్క సీబీఐ అధికారులు అవినాశ్ ను వెంబడించటం వంటివి కొనసాగుతున్నాయి.

దీంట్లో భాగంగా కర్నూలులో విశ్వభారతి ఆస్పత్రివద్దే ఉంటున్న అవినాశ్ రెడ్డి ఉండగా సీబీఐ అదే ఆస్పత్రికి సీబీఐ అధికారులు చేరుకోవటంతో ఉత్కంఠ కలిగిస్తోంది. నాలుగు రోజులుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ లో తల్లి వైఎస్ లక్ష్మమ్మ దగ్గర ఉన్నారు. కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ లో వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మమ్మ చికిత్స పొందుతున్నారు. దీంతో కోడలి భారతీ మేనమామ భార్య లక్ష్మమ్మను విజయమ్మ పరామర్శించటానికి వెళ్లారు.