మరోసారి ఓట్లు అడుక్కోను.. ఎమ్మెల్యేగా పోటీ చేయను : వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. కార్యకర్తలు వచ్చినా,

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 03:47 PM IST
మరోసారి ఓట్లు అడుక్కోను.. ఎమ్మెల్యేగా పోటీ చేయను : వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. కార్యకర్తలు వచ్చినా,

కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. కార్యకర్తలు వచ్చినా, రాకపోయినా… వాళ్ల కాళ్లు పట్టుకోనని అన్నారు. ఏదైనా పని కావాలంటే కార్యకర్తలే తన దగ్గరకు రావాలన్నారు.  తాను ఏదో చెయ్యాలని ఎమ్మెల్యేను అయ్యానని.. కానీ ఏదో అయ్యిందని వాపోయారు. ఇక చాలు అంటూ ఎమ్మెల్యే ఆర్థర్‌ నైరాశ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు.
 
సమాచారం ఇవ్వకుండానే వస్తున్నారని ఎమ్మెల్యే ఆర్థర్‌ను కార్యకర్తలు ప్రశ్నించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికీ తిరిగి ఓట్లడిగి గెలిపిస్తే… సమాచారం ఇవ్వకుండానే వస్తున్నారని కార్యకర్తలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో.. కార్యకర్తల తీరుపై ఎమ్మెల్యే ఆర్థర్‌ ఆగ్రహం చేశారు. జూపాడు మండలం బన్నూరులో ఓ కార్యక్రమానికి ఆర్థర్‌ హాజరైన సందర్భంలో ఈ మొత్తం ఎపిసోడ్ జరిగినట్లు తెలిసింది.

ఎమ్మెల్యే ఆర్థర్ చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. అసలు ఆయన అలా ఎందుకు అనాల్సి వచ్చింది అని చర్చించుకుంటున్నారు. ఏం జరిగింది? ఎమ్మెల్యే ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.

Also Read : మీసం మెలేసి చెబుతున్నా ”పవన్” పాలకొల్లు నాయుడు