YSRCP MLCs: ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు
స్థానిక సంస్థల కోటాలో విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
Andhrapradesh: స్థానిక సంస్థల కోటాలో విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిచేత మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకారం చేసిన వారిలో..
పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి (వైఎస్సార్ కడప జిల్లా, వైఎస్సార్సీపీ)
నార్తు రామారావు (శ్రీకాకుళం జిల్లా, వైఎస్సార్సీపీ)
కుడుపూడి సూర్యనారాయణ రావు (తూర్పుగోదావరి జిల్లా, వైఎస్సార్సీపీ)
వంకా రవీంద్రనాథ్ (పశ్చిమగోదావరి జిల్లా, వైఎస్సార్సీపీ)
కావూరు శ్రీనివాస్ (పశ్చిమగోదావరి జిల్లా, వైఎస్సార్సీపీ)
మేరిగ మురళీధర్ (నెల్లూరు జిల్లా, వైఎస్సార్సీపీ)
అలంపూరు మధుసూధన్ (కర్నూలు జిల్లా, వైఎస్సార్సీపీ)
సిపాయి సుబ్రమణ్యం (చిత్తూరు జిల్లా, వైఎస్సార్సీపీ)
ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బుడి ముత్యాల నాయుడు, చెల్లబోయిన వేణు, మెరుగు నాగార్జున , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.