Stock Market Closing: ఈ ఏడాది ఫస్ట్ ట్రేడింగ్లో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు మంచి కొనుగోళ్లతో లాభాల్లోనే ముగిశాయి.
Stock Market: కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు మంచి కొనుగోళ్లతో లాభాల్లోనే ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసిన తర్వాత, రెండు సూచీలు లాభాల్లో ముగిశాయి.
ఈరోజు సెన్సెక్స్ 966.08 పాయింట్లు అంటే 1.66 శాతం లాభంతో 59,219.90 వద్ద ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ ఇండెక్స్ 283.05 పాయింట్లు అంటే 1.63 శాతం లాభంతో 17,637.10 స్థాయి వద్ద ముగిసింది.
2022 ఏడాదిలో ఇదే మొదటి ట్రేడింగ్ సెషన్ కాగా.. ఓవైపు ఒమిక్రాన్ టెన్షన్స్ కొనసాగుతున్నా మార్కెట్స్ మాత్రం ఆరంభం నుంచి పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి.
ఈరోజు ఫార్మా మరియు హెల్త్కేర్ సెక్టార్ నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, పీఎస్యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు మాత్రం లాభాల్లోనే ముగిశాయి.