పరువు హత్య-కులాంతర వివాహం చేసుకున్నాడని బావను హత్య చేసిన బావమరుదులు

కులాంతర వివాహం చేసుకున్నాడని హర్యానాలో ఓ యువకుడిని అమ్మాయి సోదరులు దారుణంగా పొడిచి చంపారు. పానిపట్ లో నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంద

పరువు హత్య-కులాంతర వివాహం చేసుకున్నాడని బావను హత్య చేసిన బావమరుదులు

honour killing : కులాంతర వివాహం చేసుకున్నాడని హర్యానాలో ఓ యువకుడిని అమ్మాయి సోదరులు దారుణంగా పొడిచి చంపారు. పానిపట్ లో నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. హర్యానాలో గత మూడు రోజుల్లో రెండో పరువు హత్య.

నీరజ్(23) అనే యువకుడు వేరే కులానికి చెందిన యువతిని నెలన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. ఈవిషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. కాగా… ఈవిషయంపై పంచాయతీ పెద్దల ముందు  ఇరు కుటుంబాల పెద్దలు పెళ్ళిని అంగీకరించి లిఖిత పూర్వకంగా ఆమోదం తెలిపారు. కానీ, వీరి పెళ్లిని యువతి సోదరులు అంగకరించలేదు. అప్పటి నుంచి కొత్త దంపతులను బెదిరిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం మాట్లాడాలి రమ్మనమని చెప్పి నీరజ్ ను మార్కెట్ ప్రాంతానికి పిలిచారు.

అక్కడ వారు అతడ్ని కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. కనీసం 12 కంటే ఎక్కువ కత్తి పోట్లు అతని శరీరంలో ఉన్నట్లు సీసీ టీవీలో రికార్డయ్యింది. దాడికి కొన్ని నిమిషాలు ముందు నీరజ్‌ భార్యకు ఫోన్‌ చేసి,  త్వరలోనే ఏడుస్తావంటూ బెదిరించారనీ, పథకం ప్రకారమే తన సోదరుడిని పొట్టన పెట్టుకున్నారని నీరజ్ సోదరుడు కన్నీంటి పర్యంతమయ్యాడు.  పోలీసుల నుంచి రక్షణ కోరినా లభించలేదని అతను తెలిపాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పానిపట్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ వాట్స్   పేర్కొన్నారు.