14-year-old killed: రూ.18,000 కోసం 14 ఏళ్ల బాలుడిని చంపి మురుగు కాలువలో పడేసిన ఐదుగురు

ఓ బాలుడి(14)ని రూ.18,000 కోసం ఐదుగురు యువకులు దారుణంగా చంపేసి మురుగు కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడిని మంజీత్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని గుర్తించిన వెంటనే ఇటీవల నమోదైన కిడ్నాప్ కేసులను పరిశీలించామని అన్నారు.

14-year-old killed: రూ.18,000 కోసం 14 ఏళ్ల బాలుడిని చంపి మురుగు కాలువలో పడేసిన ఐదుగురు

Crime news in hederabad

14-year-old killed: ఓ బాలుడి(14)ని రూ.18,000 కోసం ఐదుగురు యువకులు దారుణంగా చంపేసి మురుగు కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడిని మంజీత్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని గుర్తించిన వెంటనే ఇటీవల నమోదైన కిడ్నాప్ కేసులను పరిశీలించామని అన్నారు.

మంజీత్ కనపడడం లేదని ఇటీవల అతడి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. జనవరి 19న మంజీత్ తల్లిదండ్రులు ఫిర్యాదు నమోదు చేశారని, తమ కుమారుడు జనవరి 8న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని చెప్పారని వివరించారు. 14 ఏళ్ల బాలుడి మృతదేహం దొరికాక మంజీత్ తల్లిదండ్రులను పిలిచామని అన్నారు.

అది మంజీత్ మృతదేహమేనని వారు చెప్పారని తెలిపారు. దీనిపై విచారణ జరిపి హర్షిత్, విక్రమ్, విపిన్, పంకజ్ అనే నలుగురు యువకులను అరెస్టు చేశామని అన్నారు. హర్షిత్, విక్రమ్ కు షాబాద్ డెయిరీ ప్రాంతంలోని డీ బ్లాక్ లో వస్త్ర దుకాణం ఉందని, వారి నుంచి మంజీత్ రూ.18,000 విలువచేసే దుస్తులను తీసుకుని డబ్బులు ఇవ్వలేదని పోలీసులు గుర్తించారు.

డబ్బులు తర్వాత ఇస్తానని మంజీత్ చెప్పుకుంటూ వస్తున్నాడని, అంతేగాక, తనను డబ్బుల కోసం ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్లో నకిలీ ఫిర్యాదు చేస్తానని బెదిరించేవాడని నిందితులు చెప్పారు. దీంతో మరో ముగ్గురితో కలిసి హర్షిత్, విక్రమ్.. ఇటీవల మంజీత్ తో గొడవపడి చంపేశారని పోలీసులు తేల్చారు. అనంతరం మంజీత్ మృతదేహాన్ని ఓ మురుగు కాలువలో, రక్తంతో తడిచిన అతడి దుస్తులను మరో మురుగు కాలువలో పడేశారని చెప్పారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Jamuna passed away : ఇందిరాగాంధీపై అభిమానంతో..! రాజకీయాల్లోనూ రాణించిన జమున..