Telangana : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 198 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ల క్రాస్ రోడ్ హమాలీ కాలనీ వద్ద మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. 

Telangana : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

Ganja Seized

Telangana : భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 198 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ల క్రాస్ రోడ్ హమాలీ కాలనీ వద్ద మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.  ఆరోడ్డులో వస్తున్న స్కార్పియో వాహనం డ్రైవర్ పోలీసులను చూసి…తనిఖీల కోసం వాహనాన్ని ఆపకుండా వేగంగా ముందుకుపోనిచ్చాడు.

స్కార్పియో వాహనాన్ని వెంబడించిన పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో సుమారు 40 లక్షల రూపాయలు విలువచేసే 198 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.

ఆ వ్యక్తి భద్రాచలం నుండి ఖమ్మం వైపు వాహనంలో వెళ్తూ పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా పట్టుకున్నట్లు  పోలీసులు తెలిపారు. గంజాయి తో పాటు, వాహనాన్ని, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read : Andhra Pradesh : కుప్పంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం