హోటల్‌కు తీసుకెళ్లి : నిద్రిస్తున్న యువతిపై బంధువు అత్యాచారం

  • Published By: sreehari ,Published On : November 11, 2019 / 10:06 AM IST
హోటల్‌కు తీసుకెళ్లి : నిద్రిస్తున్న యువతిపై బంధువు అత్యాచారం

రెండు నెలలుగా 24ఏళ్ల యువతిని ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. దూరపు బంధువు కావడంతో ఇంట్లో అతడి గురించి చెప్పడానికి భయపడింది. తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక తనలో తానే మదనపడింది. ఒకరోజు తాను ఎగ్జామ్ రాసేందుకు హర్యాణాలోని మహేంద్రగఢ్ ప్రాంతానికి వెళ్లింది. యువతితో పాటు అతడు కూడా వెళ్లాడు. ఎగ్జామ్ సెంటర్ దగ్గర కలిశాడు. 

ఇద్దరు కలిసి మాట్లాడుకుందామని ఆమెకు నచ్చజెప్పాడు. బంధువు కావడంతో కాదనలేకపోయింది. ఇద్దరు కలిసి ఓ హోటల్ కు వెళ్లారు. ఒకే రూమ్ తీసుకున్నారు. ఆ రాత్రి హోటల్లో యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన సెప్టెంబర్ 22న జరిగింది. మహేంద్రగఢ్ పోలీసు స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. గుర్గావ్ లోని మహిళా పోలీసు స్టేషన్ కు ఫిర్యాదును బదిలీ చేశారు. బాధిత యువతి ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసినట్టు గుర్గావ్ పోలీసు పీఆర్ఓ సుభాష్ బుకాన్ తెలిపారు. ‘నేను పరీక్ష రాసేందుకు గుర్గావ్ వెళ్లాను. 

పరీక్షా కేంద్రం దగ్గర నిందితుడు కలిసి గుర్గావ్ బస్టాండ్ సమీపంలోని హోటల్లో వెళ్దామని ఒత్తిడి చేశాడు. చేసేది ఏమిలేక అతడితోనే కలిసి వెళ్లాను. హోటల్ గదిలో రాత్రి నిద్రపోతుండగా అత్యాచారాన్ని పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నన్ను చంపేస్తానని బెదిరించాడు’ అని బాధిత యువతి పోలీసులకు వెల్లడించింది. పరీక్ష రాసిన మరుసటి రోజు ఇంటికి తిరిగి వెళ్లింది. 

ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పలేకపోయింది. కొన్నిరోజులుగా బాధిత యువతి దిగులుగా ఉండటం చూసి కుటుంబ సభ్యులు ఏమైంది గట్టిగా అడిగే సరికి అసలు విషయం బయటపెట్టింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడుని త్వరలోనే పట్టుకుంటామని పోలసు అధికారి ఒకరు చెప్పారు.