Red Sandal wood Smugglers : ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్-కోటిన్నర విలువైన ఎర్ర చందనం స్వాధీనం

విదేశాలకు ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

Red Sandal wood Smugglers : ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్-కోటిన్నర విలువైన ఎర్ర చందనం స్వాధీనం

Red Sandal Smugglers

Red Sandalwood Smugglers :  విదేశాలకు ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. చిలమత్తూరు మార్గంలో ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు  కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప తెలిపారు.

అనంతపురంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…అంతర్జాతీయ ఎర్రచందనం దొంగల ముఠా సభ్యులు 19 మందిని అరెస్టు చేసి,  వారి వద్ద నుంచి 3 టన్నుల 305 కిలోల బరువున్న 165 ఎర్రచందనం దుంగలను, ఐదు వాహనాలను, 19 సెల్ ఫోలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ దుంగల విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉంటుందని తెలిపారు.

ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠా కడప – చిత్తూరు జిల్లాల నుంచి దుంగలను సేకరించి.. తమిళనాడు గోదాముల్లో నిల్వ చేస్తారని ఎస్పీ తెలిపారు. అక్కడి నుంచి శ్రీలంక మీదుగా సముద్ర మార్గాన చైనాకు అక్రమ రవాణా చేస్తూ విదేశాలకు తరలిస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు.

Also Read : Chain Snatching : చైన్‌ స్నాచింగ్ లతో ఫ్లాట్, కారు కొన్న ఇంజినీర్

దుబాయ్ కేంద్రంగా ఈ తంతంగం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులలో తమిళనాడుకు చెందిన 8 మంది, కడపకు చెందిన ఐదుగురు, చిత్తూరుకు చెందిన ఆరుగురు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారని పోలీసులు తెలిపారు.

ప్రధాన నిందితులైన బిలాల్, సాహుల్ సమీద్ (సాహుల్ బాయ్), వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు చెప్పారు. ప్రధాన నిందితులే ఈ వ్యవహారానికి సూత్రధారులని.. వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తామని ఎస్పీ తెలిపారు.