డివైడర్ ను ఢీకొట్టి ఆటో బోల్తా – ఇద్దరు మృతి

డివైడర్ ను ఢీకొట్టి ఆటో బోల్తా – ఇద్దరు మృతి

auto crashes into divider and over turn two died in rangareddy district : రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో హిమాయత్‌సాగర్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, వారిద్దరూ ఘటనా స్ధలంలోనే మరణించారు.

ఆటోను అతివేగంగా నడపటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.