Bengaluru: కాంట్రాక్ట్ కిల్లర్తో భర్తను చంపించిన భార్య.. ప్రియుడితో కలిసి మహిళ ఘాతుకం
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కాంట్రాక్ట్ కిల్లర్కు డబ్బులిచ్చి మరీ ర్తను చంపించింది ఒక మహిళ. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసులు విచారణలో అసలు విషయం వెలుగు చూసింది.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక మహిళ దారుణానికి పాల్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేయించింది 28 ఏళ్ల ఒక మహిళ. ఈ హత్య విషయంలో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోలార్ జిల్లాకు చెందిన ఆనంద-చరిత కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.
వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆనంద ట్రక్ డ్రైవర్గా పని చేసేవాడు. కుటుంబంతో కలిసి బెంగళూరు పరిధిలో ఉండేవాడు. ఈ క్రమంలో చరితకు తన ఇంటి దగ్గర్లో ఉండే చలపతితో పరిచయం ఏర్పడింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, గతంలో చలపతి తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు చరిత అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తర్వాత కొంతకాలానికి ఇద్దరూ రాజీకొచ్చారు. దీంతో వారి మధ్య బంధం బలపడింది. ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. ఈ అంశంపై ఆనంద-చరిత మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. ఆనంద మద్యం తాగుతూ, ఈ విషయంపై భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో తమ వివాహేతర బంధానికి ఆనంద అడ్డుగా ఉన్నాడని భావించిన చరిత అతడ్ని చంపాలనుకుంది. దీనిపై చలపతితో చర్చించింది.
Delhi: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ విజయం.. ‘ఆప్’ తరఫున గెలిచిన బాబీ కిన్నార్
ఇద్దరూ కలిసి తమ మీదకు అనుమానం రాకుండా ఆనందను చంపాలనుకున్నారు. ఈ హత్య చేసేందుకు చరిత తన సోదరుడి స్నేహితుడిని సంప్రదించింది. అతడు కాంట్రాక్ట్ కిల్లర్. తన భర్తను హత్య చేసేందుకు అతడితో లక్ష రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్ కింద రూ.5,000 చెల్లించింది. తర్వాత అతడు ప్లాన్ ప్రకారం ఆనందను హత్య చేశాడు. ఆనంద మృతదేహాన్ని నగర శివారులోని ఒక క్వారీలో పాతిపెట్టాడు. తర్వాత కొంతకాలానికి పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. చరిత తన నేరాన్ని అంగీకరించింది. ఆనంద మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చరితను, ఆమె ప్రియుడు చలపతిని, కాంట్రాక్ట్ కిల్లర్ను అరెస్ట్ చేశారు.