ఫ్రెండ్ ప్రాణం తీసిన బిర్యానీ బిల్లు
హైదరాబాద్ ముషీరాబాద్లో బిర్యానీ బిల్లు.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెట్టింది. ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ ముషీరాబాద్లో బిర్యానీ బిల్లు.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెట్టింది. ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ ముషీరాబాద్లో దారుణం జరిగింది. బిర్యానీ బిల్లు.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెట్టింది. ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 25న కొందరు యువకులు మద్యం సేవించారు. ఆ తర్వాత ఓ హోటల్ కి వెళ్లారు. అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశారు. అందరూ బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత బిర్యానీకి బిల్లు చెల్లించే విషయమై వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అభిలాష్ అనే యువకుడిపై మిగిలిన స్నేహితులు దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అభిలాష్ను పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ రోజు నుంచి చికిత్స పొందుతున్న అభిలాష్.. సోమవారం(డిసెంబర్ 30,2019) మృతిచెందాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అభిలాష్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read : నేను ప్రేమించిన ఫస్ట్ అమ్మాయి: రామ్ గోపాల్ వర్మ