20ఏళ్లుగా మహిళా కార్పొరేటర్ పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే అత్యాచారం

మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై అత్యాచారం, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. థానే జిల్లా

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 08:37 PM IST
20ఏళ్లుగా మహిళా కార్పొరేటర్ పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే అత్యాచారం

మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై అత్యాచారం, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. థానే జిల్లా

మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై అత్యాచారం, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. థానే జిల్లా బయందర్ మహిళా కార్పొరేటర్ ఈ ఆరోపణలు చేశారు. 20ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా తనను అత్యాచారం చేస్తున్నాడని, వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నరేంద్ర మెహతాతో పాటు ఆయన సన్నిహితుడు సంజయ్ పైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రేప్, అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఆరోపణలు చేసిన బాధితురాలు కూడా బీజేపీకి చెందిన నేత కావడం గమనార్హం. సొంత పార్టీ నేతపైనే అత్యాచారం ఆరోపణలు చేయడం బీజేపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది.

నరేంద్ర మెహతాపై మహిళా కార్పొరేటర్ చేసిన ఆరోపణల వీడియో వైరల్ గా మారింది. 1999 నుంచి తనను, తన కుటుంబసభ్యులను నరేంద్ర మెహతా వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ తీవ్రంగా స్పందించారు. వెంటనే నరేంద్ర మెహతాను అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. మహిళల సంక్షేమం, రక్షణ గురించి గళమెత్తే బీజేపీ లాంటి పార్టీలో ఇలాంటి కీచకుడు ఉండటం విచారకరం అన్నారు.

నరేంద్ర మెహతా లాంటి కీచకులు స్వేచ్చగా రోడ్లపై తిరగడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే హెచ్చరించారు. వీలైనంత త్వరగా నరేంద్రను అరెస్ట్ చేయాలన్నారు. నరేంద్ర మొహతా మరాఠీ విద్వేషి అన్నారు. ఇప్పటివరకు బీజేపీ నేతలు.. మెహతాపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం ఆశ్యర్యానికి గురి చేసిందన్నారు. కాగా, నరేంద్ర మెహతా మూడు రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేశారు.