ప్రేమించిన యువతితో పెళ్లి చేయట్లేదని ప్రియురాలు, ఆమె తల్లిని సజీవ దహనం చేసిన ప్రియుడు

ప్రేమించిన యువతితో పెళ్లి చేయట్లేదని ప్రియురాలు, ఆమె తల్లిని సజీవ దహనం చేసిన ప్రియుడు

Chennai man burnt his girl friend and her mother,due to love rejected : ప్రేమించిని ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చేయలేదని ప్రియురాలిని ఆమె తల్లిని సజీవ దహనం చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ప్రేమికుడి ఉదంతం చెన్నైలో చోటు చేసుకుంది.

చెన్నై కొరుక్కుపేట, అనంతనాయగినగర్‌లో నివసించే వెంకటమ్మ (50), వెంకటేశన్‌ దంపతులకు కుమార్తె రజిత (24) ఉంది. వెంకటేశన్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తూ నాలుగేళ్ల క్రితం మరణించాడు, దీంతో కారుణ్య నియామకాల కోటాలో రజితకు కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చారు. అదే ప్రాంతానికి చెందిన భూపాలన్‌ కుమారుడు సతీష్‌ (32) కార్పొరేషన్‌లో కాంట్రాక్టు పద్దతిన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

రజితకు ఉద్యోగం రాక ముందు నుంచే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. రజితకు కూడా చెన్నై కార్పోరేషన్ లో ఉద్యోగం రావటంతో వీరి ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి మరింత బలపడింది. ఈ క్రమంలో రజితను ఇచ్చి పెళ్లి చేయమని సతీష్ వెంకటమ్మను అడిగాడు. వెంకటమ్మ అందుకు అంగీకరించకపోగా…అదే ప్రాంతానికి చెందిన వేరోక యువకుడితో రజితకు పెళ్లి చేసేందుకు గతవారం నిశ్చితార్ధం జరిపించింది.

దీంతో సతీష్ గురువారం రాత్రి వెంకటమ్మ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తనతోపాటు తీసుకెళ్లిన పెట్రోల్ న వెంకటమ్మ, రజితలపైన పోసి నిప్పింటించాడు. తాను వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటనలో ముగ్గురూ సజీవ దహనమయ్యారు.