సోషల్ మీడియాలో పరిచయం-ప్రేమ-ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : December 7, 2020 / 08:42 PM IST
సోషల్ మీడియాలో పరిచయం-ప్రేమ-ఆత్మహత్య

Goaded by lover, Tamil Nadu girl ends life on video call : సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి తో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుందామని చెప్పాడు, కానీ అతనికి అప్పటికే పెళ్లైందని తెలుసుకుని తన జీవితాన్ని అర్ధంతరంగా ముంగించుకుంది ఓ యువతి. ఆమె ప్రాణాలు కాపాడాల్సని ప్రియుడే ఆమెను ఆత్మహత్యకు పురికొల్పడం మరింత విషాదాన్ని మిగిల్చింది. తమిళనాడులో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.



తమిళనాడుకు చెందిన ముత్తుకుమరేశన్(32) నాగ్ పూర్ లో ఆర్మీ అంబున్స్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సోషల్ మీడియా వీడియో చాటంగ్ యాప్ లో అతనికి పెరంబక్కమ్ కు చెందిన భారతి(24) అనే యువతి పరిచయం అయ్యింది.ఇద్దరూ మంచి స్నేహితులై … ప్రేమ సాగరంలో మునిగి తేలారు. ఎప్పడూ వీడియో కాల్స్ లో మాట్లాడుకోవటం ఏమిటి ? పర్సనల్ గా కలుద్దామనుకున్నారు.



నవంబర్ 18న ఇద్దరూ చెన్నైలో కలుసుకున్నారు. ఆరోజంతా సరదాగా గడిపారు. ప్రియుడి మాటల్లో అతనికి అప్పటికే పెళ్ళైందని….అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం తెలుసుకుంది. అతడి మాటలకు మోసపోయానని తెలుసుకుని ఇక ఈ ప్రేమకు, వీడియో కాల్స్ కు ఇంక ఫుల్ స్టాప్ పెడదామని చెప్పింది. ఎవరి బతుకు వారు బతుకుదామని చెప్పింది.



అయినా అతను ఆమె మాటలు వినలేదు పెళ్లి చేసుకోమని బలవంతం చేసాడు. లేకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. ఈ వేధింపులు తట్టుకోలేని భారతి డిసెంబర్ 2వ తేదీన కుమరేశన్ కు వీడియోకాల్ చేసింది. వేధింపులు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని….చేతిలో కత్తి పట్టుకుని బెదిరించింది.




ఆ సమయంలో ఆమెను వారించాల్సిన ప్రియుడు రాక్షసంగా ప్రవర్తించాడు. కత్తితో గొంతు కోసుకోవటం కన్నాఉరేసుకుంటే త్వరగా చస్తావ్ అంటూ సలహా ఇచ్చాడు. అలా వీడియో కాల్ చేస్తూనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా ఆమె ఫోన్ లో రికార్డైంది. దీని ఆధారంగా పోలీసులు నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకుని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.